భారత్‌లో ఫోర్స్ మోటార్స్ నుంచి భారీ పెట్టుబడులు

Force One
పూణేకు చెందిన ప్రముఖ యుటిలిటీ వానాల తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్ భారత మార్కెట్లో భారీ విస్తరణ ప్రణాళికలను చేపట్టనుంది. ఈ విస్తరణ కార్యకలాపాల కోసం కంపెనీ మొత్తం రూ.1,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనుంది. ఈ మొత్తంలో రూ.250 కోట్లను కొత్తగా ప్రారంభించిన వ్యక్తిగత వాహనాల విభాగం (పర్సనల్ వెహికల్స్ డివిజన్) కోసం వెచ్చించనున్నామని ఫోర్స్ మోటార్స్ మేనజింగ్ డైరెక్టర్ ప్రసన్ ఫిరోడియా పేర్కొన్నారు.

కాగా.. మిగిలిన రూ.750 కోట్లను కార్యకలాపాల విస్తరణ, వ్యాల్యూ చైన్ పటిష్టత కోసం ఖర్చు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఫోర్స్ మోటార్స్ తొలిసారిగా ప్యాసింజర్ వాహన విభాగంలో అందిస్తున్న ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం) 'ఫోర్స్ వన్' అమ్మకాల కోసం ప్రస్తుతం 20 మంది డీలర్లు ఉన్నారని, వీరి సంఖ్యను 44కు పెంచుతామని ఫిరోడియా తెలిపారు.

ప్రతి ఏటా సుమారు 6,000 నుంటి 7,000 ఫోర్స్ వన్ ఎస్‌యూవీలను విక్రయించాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని, ఈ ఏడాది చివరి నాటికి కనీసం 50,000 వాహనాలను విక్రయించి, రూ.4,500 కోట్ల టర్నోవర్‌ను సాధించాలనే లక్ష్యంతో ఉన్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం ఫోర్స్ మోటార్స్ మధ్యప్రదేశ్‌లోని పూణలో ఉన్న పీథంపూర్‌ ప్లాంట్‌లో ఏటా లక్ష వాహనాలను ఉత్పత్తి చేస్తుంది

Most Read Articles

English summary
Force Motors, the leading Indian commercial vehicle manufacturer and the builder of the Force One premium SUV has announced plans to invest a whopping Rs.1000 crores in India in the next two years. This huge investment will be utilized for new product development.
Story first published: Thursday, November 24, 2011, 11:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X