Just In
- 1 hr ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 3 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 6 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 9 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
Don't Miss
- News జగన్ ను జైల్లో పెట్టావ్.. పుట్టపర్తి సాయిబాబా సంపదంతా దోచుకున్నావ్: తగ్గని మంత్రి పెద్దిరెడ్డి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎపి లేక టిఎన్: ప్లాంటు ఏర్పాటుపై పియోజియోట్ అయోమయం
వార్షికంగా 20 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో ఈ ప్లాంటును ఏర్పాటు చేయాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఈ ప్లాంటు ప్రారంభమైతే.. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇందుకోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్లాంటును దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఈ ఫ్రాన్స్ కంపెనీను ఆకర్షించేందుకు భారత ప్రభుత్వం గతంలో ఎకరా స్థలం రూపాయి చొప్పున వెయ్యి ఎకరాలు ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు తమిళనాడులో ఏప్రిల్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కొత్త సర్కారు ఏర్పడిన తర్వాత.. ఆ ప్రభుత్వం ఇచ్చే రాయితీలను బట్టి ఈ ప్రాజెక్టు విషయాన్ని ఫైనలైజ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. జూన్ 2011 నాటికి ఈ ప్లాంటు ఏర్పాటుపై ఓ స్పషమైన నిర్ణయాన్ని తీసుకుంటామని కంపెనీ అధికారులు వెల్లడించారు. తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న తడ ప్రాంతాన్ని, తమిళనాడులో నోకియా ప్లాంటుకు సమీపంలో ఉన్న వల్లమ్ ప్రాంతాలను కంపెనీ అధికారులు పరిశీలిస్తున్నారు.
కాగా.. మౌలిక అవసరాల దృష్ట్యా చెన్నయ్ మెరుగ్గా ఉండటంతో పాటు ఇటీవలే ఆటోమొబైల్ హబ్గా అవతరించడంతో కంపెనీ ఎక్కువభాగం తమిళనాడు వైపే మొగ్గు చూపవచ్చునని, అలాగే.. ఆంధ్రప్రదేశ్ సర్కారు అందిస్తున్న రాయితీలను కూడా కంపెనీ పరిగణలోకి తీసుకునే అకాశాలు లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ అసలు విషయం తేలాలంటే జూన్ వరకూ ఆగాల్సిందే మరి.