Just In
- 5 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 8 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 10 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 14 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కుటుంబ నియంత్రణ ఆపరేషన్కి టాటా నానో ఫ్రీ
కుటుంబనియంత్రణ కోసం పురుషులు చేయించుకోవాల్సిన వేసెక్టమిను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బెంగళూరుకు చెందిన డాక్టర్ తిమ్మప్ప రూపొందించిన పథకం పలువుర్ని ఆకర్షిస్తోంది. కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సలను మహిళలే అధిక సంఖ్యలో చేయించుకుంటున్నారు. పురుషులు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. వేసెక్టమి చేయించుకుంటే శక్తి హీనులమై పోతామని, దాంపత్య జీవితానికి పనికిరాకుండా పోతామనే అపోహ కూడా ఒక కారణం. ఇవన్నీ కేవలం అనుమానాలే కానీ నిజం కాదని భారీగా ప్రచారం చేసినా సానుకూల ఫలితం రాకపోవటంతో బెంగళూరుకు చెందిన డాక్టర్ తిమ్మప్ప సరికొత్త ఆలోచన చేశారు.
కానుకులతో ప్రజల మనసుల్ని ఎందుకు మార్చకూడదన్న ఆలోచన చేశారు. అందుకు ప్రతిరూపమే నానో కారు, మూడు బైకు బహుమతులు. దీనిపై ఆయన మాట్లాడుతూ ''ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఫలితం రాలేదు. నిర్ణీత సమయంలో శస్త్ర చికిత్సలు చేసుకున్న పురుషులను లక్కీడీప్ ద్వారా బహుమతులు అందజేయాలని నిర్ణయించాం. ఇందుకు ఒక నానో కారు, మూడు బైకులు ఇవ్వాలని నిర్ణయించాం'' అని చెప్పారు.
డాక్టర్ తిమ్మప్ప ఆలోచనకు కర్ణాటకలోని ముగ్గురు ఎమ్మెల్యేలు స్పందించారు. అవసరమైన నిధులను సమకూర్చేందుకు ముందుకొచ్చారు. దాసరహళ్లి ఎమ్మెల్యే మునిరాజు నానో కారు, యలహంక శాసనసభ్యుడు విశ్వనాథ్ మూడు మోటారు సైకిళ్లు, కృష్ణరాజపుర శాసనసభ్యుడు నందీశ్ రెడ్డి రెండు మోటారు బైక్లు కానుకలుగా ఇవ్వనున్నారు. వీటిలో నానో కారు, మూడు బైక్లు ఆపరేషన్ చేయించుకున్న వారికి కానుకలుగా ఇవ్వనుంటే, ఎక్కువ మందికి ఆపరేషన్లు చేయించిన ఆరోగ్య కార్యకర్తలకు రెండు బైకులను బహుమతిగా ఇవ్వనున్నారు. జులై 28న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేయనున్నారు.