Just In
- 1 hr ago భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- 2 hrs ago రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- 3 hrs ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 5 hrs ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
Don't Miss
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Movies Tillu Square Collections సిద్దూ జొన్నలగడ్డ రికార్డుల మోత.. టిల్లు స్క్వేర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?
15 శాతం వరకూ పెరిగిన ఆడి లగ్జరీ కార్ల ధరలు
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న కార్ల ధరలు మరింత ప్రియం అయ్యాయి. తమ ఉత్పత్తుల ధరలను 15 శాతం మేర పెంచుతున్నామని, పెరిగిన ధరలు మార్చి 16, 2013 నుంచే అమల్లోకి వచ్చాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. తాజా పెంపుతో ఆడి క్యూ రేంజ్ ఎస్యూవీల ధరలను 2.5 శాతం వరకూ ప్రియం కాగా, ఆడి ఆర్8, ఆడి ఆర్ఎస్5 వంటి స్పోర్ట్స్ కార్ల ధరలు 15 శాతం వరకూ పెరిగాయి.
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2013-14లో వివిధ మోడళ్లపై కస్టమ్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీలను పెంచిన నేపథ్యంలో, తమకు వేరే మార్గం లేక ఉత్పత్తుల ధరలను కూడా పెంచాల్సి వస్తోందని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు. తాము ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకున్నామని, అందుకే ఆడి కార్లను కొనుగోలుచేసేందుకు తమ వినియోగదారులకు ఆడి ఫైనాన్స్ ద్వారా ఆకర్షనీయమైన ఫైనాన్స్ ఆప్షన్లను అందిస్తున్నామని ఆయన చెప్పారు.
మరోవైపు మెర్సిడెస్ బెంజ్ ఇండియా కూడా తమ ఉత్పత్తుల ధరలను వచ్చే నెల నుంచి పెంచనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. తాజాగా ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2013-14లో ఎస్యూవీలపై ఎక్సైంజ్ సుంకాన్ని, అలాగే సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకునే లగ్జరీ కార్లపై దిగుమతి సుంకాన్ని పెంచిన నేపథ్యంలో, ఆ భారాన్ని కొనుగోలుదారులపై మోపక తప్పడం లేదని కంపెనీ పేర్కొంది.
ఈ మేరకు, మెర్సిడెస్ బెంజ్ ఇండియా స్థానికంగా అసెంబ్లింగ్ చేస్తున్న మోడళ్లపై రూ.1-4 శాతం, సిబియూ రూట్లో దిగుమతి చేసుకునే వాహనాలపై 20 శాతం చొప్పును ధరలను పెంచనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. పెరిగిన ఏప్రిల్ 1, 2013 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. అయితే, ఏయే మోడల్పై ఎంత మేర పెంచునున్నామనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. బిఎమ్డబ్ల్యూ ఇండియా కూడా త్వరలోనే ధరల పెంపును ప్రకటించే ఆస్కారం ఉంది.