Just In
- 12 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 12 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 14 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 15 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Movies Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్కు అలాంటి టాక్.. అదొక్కటే మైనస్.. ఇంతకీ హిట్టేనా అంటే!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రూ.10 లక్షల కన్నా తక్కువ ధర కలిగిన కార్లపై ఎస్యూవీ టాక్స్ వద్దు: ప్రఫుల్ పటేల్
ఈ విషయం గురించి ప్రఫుల్ పటేల్ ప్రస్తానిస్తూ, ఎస్యూవీలపై విధించిన ఎక్సైజ్ సుంకాన్ని మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందని, మోటార్ వాహన చట్టంలో ఎస్యూవీల గురించి సరైన వర్గీకరణ లేకపోవటం వల్లనే ఈ గందరగోళం తలెత్తిందని ఆయన అన్నారు. ఈ పెంపు వలన గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల రవాణా కోసం ఎక్కువగా ఉపయోగించే టాటా సుమో, మహీంద్రా బొలెరో వంటి వాహనాల ధరలు ప్రభావితమయ్యాయని ఆయన అన్నారు.
ఈ విషయాన్ని ఆర్థికమంత్రి పి చిదంబరం దృష్టికి తీసుకువెళ్లానని, రూ.10 లక్షలకు దిగువన ఉండే ఏ రకమైన వాహనాన్నైనా ఈ ఎస్యూవీ టాక్స్ నుంచి మినహించాలని ప్రతిపాదనలు చేశానని ప్రఫుల్ పటేల్ చెప్పారు. హైఎండ్ లగ్జరీ కార్లను ఉపయోగించే వారికి మాత్రం తప్పనిసరిగా ఈ పెంపును అలానే ఉంచాలి, వారికి సబ్సిడీ డీజిల్ను విక్రయించకూడదని అన్నారు. ఎస్యూవీలపై విధించిన అధిక సుంకాల విషయాన్ని పునఃపరిశీలించాలని ఆటోమొబైల్ పరిశ్రమ కోరటంలో న్యాయం ఉందని ఆయన అన్నారు.