Just In
- 4 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 5 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 6 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 7 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Movies 30 రూపాయలకే మూవీ టికెట్.. ముఖం చాటేసిన ఆడియెన్స్.. భారీ నష్టాల్లో సూపర్ స్టార్స్ మూవీ!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆరు నెలల్లో డీజిల్ ధరపై నియంత్రణ ఎత్తివేత: వీరప్ప మొయిలీ
ప్రస్తుతం ప్రతినెలా 50 పైసల చొప్పున పెరుగుతున్న డీజిల్ ధరలు మరో ఆరు నెలలో తర్వాత ఏక మొత్తంలో పెరిగే అవకాశం ఉంది. రానున్న ఆరు నెలల్లో డీజిల్ ధరలకు పూర్తిగా స్వేచ్ఛ (డీరెగ్యులేట్) కల్పిస్తామని కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ వెల్లడించారు. ప్రస్తుతం డీజిల్ విక్రయాలపై ఆదాయ నష్టం లీటరుకు రూ.9.28 మేర ఉంటోందని కేపీఎంజీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు.
డీజిల్ విక్రయంపై నష్టం ఉన్నప్పటికీ, ధరను ఒక్కసారిగా రూ.3 లేదా రూ.4 చొప్పున పెంచే యోచనేదీ లేదని, స్వల్ప పెరుగుదల క్రమంగానే కొనసాగుతుందని మొయిలీ వివరించారు. ప్రస్తుత పెరుగుదలను బట్టి చూస్తే డీజిల్పై చమురు కంపెనీల తమ నష్టాలు భర్తీ చేసుకునేందుకు 19 నెలలు పడుతుందని అంచనా. అయితే, రూపాయి బలపడటం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే ఆరు నెలల కాలం సరిపోవచ్చని భావిస్తున్నట్లు మొయిలీ చెప్పారు.
త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కూడా డీజిల్ డీరెగ్యులేషన్ విషయంలో వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఉత్పత్తి వ్యయాల కన్నా తక్కువగా ప్రభుత్వం నిర్దేశించిన రేటుకే డీజిల్ని విక్రయిస్తున్నాయి. ఫలితంగా, చమురు సంస్థలకు కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వం చేయాల్సి వస్తుంది. ఇలా ఇప్పటికే ప్రభుత్వంపై ఆర్థిక భారం అధికమవుతోంది. ఈ భారం నుంచి పూర్తిగా తప్పించుకునే సర్కారు మరో ఆరు నెలల్లో ఈ నిర్ణయం తీసుకోనుంది.