Just In
- 4 min ago భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- 1 hr ago రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- 2 hrs ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 3 hrs ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
Don't Miss
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Movies Tillu Square Collections సిద్దూ జొన్నలగడ్డ రికార్డుల మోత.. టిల్లు స్క్వేర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
భారత రోడ్లు ఇప్పటికీ సురక్షితం కాదు: డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్
రోడ్డు సేఫ్టీకి సంబంధించి, ప్రమాధానికి కారణమయ్యే.. మద్యం సేవించి వాహనం నడపటం, మితిమీరిన వేగంతో డ్రైవ్ చేయటం, హెల్మెట్లు, సీట్ బెల్ట్లు, ఛైల్డ్ రెస్ట్రైంట్స్ వంటి ధరించకపోవటం అనే ఐదు కీలక నిబంధనలకు కట్టుబడి ఉండేది కేవలం 28 దేశాలు మాత్రమే పాటిస్తున్నాయని, మిగిలిన ఈ దేశాల్లో ఈ నిబంధనలను గాలికి వదిలేస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ తన నివేదిక తెలిపింది.
పై నిబంధనలను పాటించే దేశాల జనాభ, మొత్తం ప్రపంచ జనాభాలో కేవలం 7 శాతం మాత్రమే. అంటే ఇంకా 93 శాతం మంది ఈ నిబంధనలకు కట్టుబడి డ్రైవింగ్ చేయటం లేదని తేటతెల్లమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ఏటా 12.4 లక్షల మంది చనిపోతుండగా, అందులో మన దేశంలోనే ఏటా లక్ష మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారు.
రానున్న ఐదేళ్లలో రోడ్ సేఫ్టీ విషయంలో అవగాన కల్పించేందుకు డబ్ల్యూహెచ్ఓ రోడ్ సేఫ్టీ విభాగం చేపట్టనున్న ప్రాజెక్టులో టాప్ 10 దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ఇందుకోసం ఆరుగురు అంతర్జాతీయ భాగస్వాములతో కూడిన ప్యానెల్ను డబ్ల్యూహెచ్ఓ నియమించనుంది.
ఇప్పటికే ఈ ప్రాజెక్టును, హెల్మెట్లు ధరించకుండా మోటార్సైకిళ్లు ద్విచక్ర వాహనాలు నడపటం, వేగానికి మించి వాహనాలు నడపటం ఎక్కువగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో అమల్లోకి తీసుకువచ్చారు. దశల వారీగా మరిన్ని రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టును అమలుపరచి భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించాలని డబ్ల్యూహెచ్ఓ లక్ష్యంగా పెట్టుకుంది.