Just In
- 59 min ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 1 hr ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 2 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 3 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Movies Anasuya Bharadwaj: "నేను జబర్దస్త్ మానేయడానికి కారణం అదే.. పవన్ కల్యాణ్ చెప్తే ఆ పని చేస్తా"
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
డిసెంబర్ 12న భారత్లో లాంబోర్గినీ ట్రాక్టర్ల విడుదల
ఇటలీకు చెందిన ప్రముఖ సూపర్ కార్ల తయారీ సంస్థ లాంబోర్గినీ తమ 'సూపర్ ట్రాక్టర్ల'ను ఇండియాలో ప్రవేశపెట్టనున్నట్లు గడచిన ఏప్రిల్ నెలలో తెలుగు డ్రైవ్స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. తాజా అప్డేట్ ప్రకారం, లాంబోర్గినీ భారత్లో తమ ట్రాక్టర్ల విడుదలకు ముహుర్తం ఖరారు చేసింది. ఈనెల 12వ తేదీన లాంబోర్గినీ ట్రాక్టర్లు భారత మార్కెట్లో విడుదల కానున్నాయి.
దేశంలోని సంపన్న రైతు కుటుంబాలను, ధనవంతులను లక్ష్యంగా చేసుకొని లాంబోర్గినీ ఈ ట్రాక్టర్లను భారత్లో విడుదల చేయబోతోంది. దీన్నిబట్టి చూస్తుంటే, లాంబోర్గినీ ట్రాక్టర్లు సామాన్య రైతులకు అందని ద్రాక్షగానే మిగిలే ఆస్కారం ఉంది. ఈ ట్రాక్టర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు డిసెంబర్ 12, 2013న తెలియనున్నాయి.
ఇది కూడా చదవండి: 2013 నైట్రో ట్రాక్టర్ను ఆవిష్కరింటిన లాంబోర్గినీ
వాస్తవానికి లాంబోర్గినీ సూపర్కార్ల తయారీ కన్నా ముందుగా ట్రాక్టర్లను ఉత్పత్తి చేసేది. అయితే, లాంబోర్గినీ సూపర్కార్లు మంచి ప్రాచుర్యాన్ని సంపాధించుకోవటంతో, ట్రాక్టర్ల వ్యాపారం సేమ్ డచ్-ఫార్ (ఎస్డిఎఫ్) (SAME Deutz-Fahr) గ్రూపులో భాగమైంది.
ఇది కూడా చదవండి.. లాంబోర్గినీ కార్ల తయారీ ఎలా మొదలైంది?
ఎస్డిఎఫ్ ఇండియా, తమిళనాడులోని రాణిపేట్ ఉత్పత్తి కేంద్రంలో లాంబోర్గినీ ట్రాక్టర్ల ఉత్పత్తి చేస్తోంది. అయితే, ఇక్కడ ఉత్పత్తి అయిన ట్రాక్టర్లను భారత మార్కెట్లో విక్రయించడం లేదు. వీటిని నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గడచిన సంవత్సరంలో ఎస్డిఎఫ్ గ్రూప్ భారత్లో నిర్మించిన 6,000 ట్రాక్టర్లలో 800 ట్రాక్టర్ల లాంబోర్గినీ లోగోతో రూపొందించారు. ఈ ట్రాక్టర్లను యూరప్, మలేషియా దేశాలకు కంపెనీ ఎగుమతి చేస్తోంది. ఈ ట్రాక్టర్లలో ఎక్కువ భాగం స్థానికంగా భారత్లో లభించే విడిభాగాలను ఉపయోగిస్తున్నారు.