Just In
- 5 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 5 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 6 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 8 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
లీటరు డీజిల్కు 45.8 కి.మీ. మైలేజీనిచ్చిన స్విఫ్ట్ డిజైర్!
దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న కాంపాక్ట్ సెడాన్ 'స్విఫ్ట్ డిజైర్'ను టార్గెట్ చేస్తూ హోండా కార్స్ ఇండియా ప్రవేశపెట్టిన కాంపాక్ట్ సెడాన్ 'హోండా అమేజ్', భారత మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న నేపథ్యంలో, మారుతి తమ ప్రోడక్ట్ను మార్కెటింగ్ చేసుకునేందుకు వివిధ మార్కెటింగ్ క్యాంపైన్లను నిర్వహిస్తోంది.
స్విఫ్ట్ డిజైర్ భారత మార్కెట్లో విడుదలై 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, మారుతి సుజుకి గడచిన ఆదివారం దేశవ్యాప్తంగా 'డిజైరబుల్ మైలేజ్ ర్యాలీ'ని నిర్వహించింది. దేశవ్యాప్తంగా 31 నగరాల్లో (ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్, వైజాగ్ల్లో) ఈ ర్యాలీని నిర్వహించామని, హైదరాబాద్లో తమ రీజనల్ మేనేజర్ ఓంకార్ నాథ్ ఈ ర్యాలీని ప్రారంభించారని కంపెనీ పేర్కొంది.
ఈ క్యాంపైన్లో దాదాపు 62 మందికి పైగా డిజైర్ యజమానులు పాల్గొన్నారు. మైలేజ్లో స్విఫ్ట్ డిజైర్ సత్తా ఏంటో చూపించడమే ఈ క్యాంపైన్ యొక్క ప్రత్యేకత. సాధారణంగా ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ వెర్షన్ లీటరుకు 19.1 కిలోమీటర్ల మైలేజీని, డీజిల్ వెర్షన్ లీటరుకు 23.4 కిలోమీటల్ మైలేజీనిస్తుంది.
అయితే, ఈ ర్యాలీలో పాల్గొన్న గురుదీప్ సింగ్ స్విఫ్ట్ డిజైర్ డీజిల్ కారు 45.8 కి.మీ. మైలేజీని ఇచ్చింది. అలాగే శ్రీరంగ్ చిండార్కర్ డిజైర్ పెట్రోల్ కారు 42.1 కి.మీ. మైలేజీనిచ్చింది. హైదరాబాద్లో సగటు మైలేజ్ డీజిల్ కార్లకు సంబంధించి 30.1 కి.మీ., విశాఖలో 39 కి.మీ.గా నమోదు కాగా, పెట్రోల్ కార్లకు సంబంధించి హైదరాబాద్లో 22.9 కి.మీ., విశాఖలో 46 కి.మీ. చొప్పున వచ్చిందని మారుతి సుజుకి పేర్కొంది.