Just In
- 2 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 2 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 4 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 5 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
2014లో డీజిల్ ఇంజన్తో రానున్న మిత్సుబిషి అవుట్లాండర్
జపనీస్ కార్ కంపెనీ మిత్సుబిషి ఇండియా, దేశీయ మార్కెట్లో నిలిపివేసిన అవుట్లాండర్ ప్రీమియం ఎస్యూవీ అమ్మకాలను వచ్చే ఏడాది తిరిగి కొనసాగించనుంది. కొత్త డీజిల్ ఇంజన్తో అప్గ్రేడ్ చేసిన అధునాతన అవుట్లాండర్ ఎస్యూవీని మిత్సుబిషి 2014లో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు,
భారత మార్కెట్లో అమ్మకాలు బలహీనంగా ఉండటంతో మిత్సుబిషి ఇండియా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న సెడియా స్పోర్ట్స్, ఇవల్యూషన్ ఎక్స్ మరియు పెట్రోల్ వెర్షన్ అవుట్లాండర్ అమ్మకాలను నిలిపివేసిన సంగతి తెలిసినదే. హిందుస్థాన్ మోటార్స్ సీఓఓ పి విజయన్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవుట్లాండర్ను 2014లో డీజిల్ ఇంజన్తో విడుదల చేస్తామని పేర్కొన్నారు.
2014లో రానున్న ఈ కొత్త డీజిల్ పవర్డ్ అవుట్లాండర్ ఎస్యూవీ 3వ తరానికి చెందినది. గతేడాదే ఈ ఎస్యూవీని అంతర్జాతీయ మార్కెట్లోల విడుదల చేశారు. ప్రీమియం ఇంటీరియర్లతో పాటుగా అనేక కొత్త ఫీచర్లతో ఈ కారును విక్రయిస్తున్నారు.
ఇంజన్ విషయానికి వస్తే, 2014 అవుట్లాండ్ డీజిల్లో 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 147 హార్స్ పవర్ల శక్తిని, 380 న్యూటన్ మీటర్ల టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ను 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్తో జతచేసుకునే వెసలుబాటు ఉంటుంది.
గతంలో మిత్సుబిషి తమ 2వ తరం అవుట్లాండర్ను భారత్కు సిబియూ రూట్లో దిగుమతి చేసుకొని విక్రయించేది. అయితే, హిందుస్థాన్ మోటార్స్తో మిత్సుబిషి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఇప్పుడు ఈ ఎస్యూవీని హిందుస్థాన్ మోటార్స్కు చెందిన చెన్నైలో తిరువల్లూర్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నారు. 2014 అవుట్లాండర్ డీజిల్ విడుదలైన తర్వాత ఇది పాజెరో స్పోర్ట్, మోంటెరో ఎస్యూవీల సరసన ఇది కూడా నిలువనుంది.