Just In
- 28 min ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 3 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 4 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- 5 hrs ago మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
Don't Miss
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Movies Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
డీజిల్ ధర పెంపును స్వాగతించిన ఆటోమొబైల్ పరిశ్రమ
ఈ పెంపు వలన స్వల్పకాలికంగా డీజిల్ వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టవచ్చునని, అయితే ఇది దీర్ఘకాలంలో పరిశ్రమకు, ఆర్థికవ్యవస్థకు విభిన్న ప్రయోజనాలు చేకూర్చి పెడుతుందని సియామ్ తెలిపింది. గత వారంలో విడతల వారీగా డీజిల్ ధరను రానున్న 10 నెలల్లో రూ.10 మేర పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. పెట్రోలియం ఉత్పత్తుల్లో విడతల వారీగా పెంపు ఉంటుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా బలంగా వ్యాఖ్యానించారు.
చమురు కంపెనీలు వంట గ్యాస్, డీజిల్, కిరోసిసన్లను మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే విక్రయిస్తుండటంతో గడచిన సంవత్సరంలో సుమారు 1,67,000 కోట్ల ఆదాయ నష్టం వాటిళ్లనట్లు అంచనా. ఈ భారమంతా ప్రభుత్వం పైనే పడుతోంది. ఈ ఒత్తిళ్ల నేపథ్యంలో, పెట్రో మంట నుంచి తప్పించుకునేందుకు గాను, సర్కారు ఈ ప్రతిపాదనలను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.గడచిన సెప్టెంబర్ నెలలో డీజిల్ ధరలను ఒక్కసారిగా ప్రతి లీటరుపై రూ.5 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.47.15 లుగా ఉంది. ఈ ధరకు విక్రయిస్తున్నప్పటికీ ఆయిల్ కంపెనీలు ప్రతి లీటరు డీజిల్ విక్రయంపై రూ.9.28 నష్టపోతున్నట్లు పేర్కొన్నాయి.