Just In
- 7 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 9 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 10 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 12 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
భారత్లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్న అశోక్ లేలాండ్
హిందూజా గ్రూపుకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం అశోక్ లేలాండ్, యూకేలో విజవంతంగా నిర్వహిస్తున్న ఆప్టేర్ బస్సులకు ఎలక్ట్రిక్ వెర్షన్లను ఇండియాలో కూడా అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో వీటిని అందుబాటులోకి తీసుకువస్తామని అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కె. దాసరి తెలిపారు.
యూకేకి చెందిన ఆప్టేర్ పిఎల్సిలో అశోక్ లేలాండ్కు మెజారీ వాటా ఉంది. యూకే ప్రభుత్వం తమ గ్రీన్ ఫండ్ స్కీమ్స్తో అప్టేర్కు ఎంతగానో సహకరించిందని, ఫలితంగా ఆప్టేర్ సరికొత్త టెక్నాలజీని సృష్టించి ఇప్పుడు ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ బస్సుల తయారీలో ప్రపంచంలో కెల్లా అగ్రగామి కంపెనీలలో ఒకటిగా నిలిచిందని ఆయన అన్నారు.
ఆప్టేర్ ఎలక్ట్రిక్ బస్సులను 2015 నుంచి భారత్లో తయారు చేయడం ప్రారంభిస్తామని, ఢిల్లీల్లో వచ్చే ఏడాది జనవరి 22న జరిగే బస్ ఎక్స్పోలో వీటిని ప్రదర్శనకు ఉంచుతామని వినోద్ తెలిపారి. ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఫుల్గా చార్జ్ చేస్తే, వీటిపై 200 కి.మీ. దూరం వరకు ప్రయాణించవచ్చని, ఒక్కో బస్సు ఖరీదు సుమారు రూ.2-3 కోట్లు ఉంటుందని ఆయన వివరించారు.
భారత మార్కెట్లో ఆప్టేర్ ఎలక్ట్రిక్ బస్సులను అశోక్ లేలాండ్ బ్యాడ్జ్తోనే విక్రయిస్తామని, ప్రారంభ దశలో భాగంగా ఆప్టేర్ సోలో, వెర్సా మెడళ్లను భారత్లో తయారు చేస్తామని, ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వాల కోసమే వీటిని తయారు చేస్తామని వినోద్ తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులలో కేవలం మోటార్లు, బ్యాటరీలు మాత్రమే ఉంటాయని, అయితే హైబ్రిడ్ బస్సులలో మాత్రం ఓ చిన్నపాటి డీజిల్ ఇంజన్తో పాటుగా ఎలక్ట్రిక్ మోటార్లు కూడా ఉంటాయని ఆయన వివరించారు.