Just In
- 8 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 11 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 13 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 16 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
యాక్సిడెంట్: మూడు ముక్కలైన బిఎమ్డబ్ల్యూ కార్; ఇద్దరు మృతి
మనం ఎంతటి గొప్ప సేఫ్టీ ఫీచర్లు కలిగిన కారులో ప్రయాణిస్తున్నా సరే మన జాగ్రత్తలో మనం లేకపోయినా లేదా అదృష్టం మన వెంటలేకపోయినా ఫలితం మాత్రం శూన్యమే. ఇదిగో ఈ భీకర యాక్సిడెంట్ దృశ్యాలను చూడండి. ఇది లుథియానాలో జరిగింది.
లుథియానాలో ఓ బిఎమ్డబ్ల్యూ లగ్జరీ కారు యాక్సిడెంట్కు గురైంది. యాక్సిడెంట్ సమయంలో కారులో ముగ్గురు ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఇద్దరు అక్కడిక్కడే చనిపోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన వారంతా 25-27 ఏళ్ల వయస్సు లోపు వారే కావటం గమనార్హం.
మరింత
సమాచారం
తర్వాతి
సెక్షన్లో..
మరిన్ని
వివరాలను
ఈ
ఫొటో
ఫీచర్లో
పరిశీలించండి..!
లుథియానా అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పరమ్జిత్ సింగ్ పన్ను తెలిపిన సమాచారం ప్రకారం, గగన్ శర్మ, రజ్జత్ దువా అనే ఇద్దరు వ్యక్తులు స్పాట్లోనే చనిపోగా, ధాని రామ్ (కారు యజమాని) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ప్రమాదానికి సంబంధించిన అసలు కారణంగా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, మితి మీరిన వేగం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో కారు నడిపిన వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడా లేదా అనే అంశాన్ని కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయనున్నారు.
ఈ ప్రమాదం గడచిన ఆదివారం ఉదయం జరిగింది. వేగంగా వచ్చిన కారు సరభానగర్ రోడ్డుపై అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టను ఢీకొట్టడంతో కారు మూడు ముక్కలుగా విరిగిపోయింది. ఈ ఫొటోలను చూస్తుంటే, ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉండి ఉంటుందో అంచనా వేయవచ్చు.
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్డబ్ల్యూ ప్రపంచంలో కెల్లా అత్యుత్తమైన సేఫ్టీ కార్లను తయారు చేస్తుంటుంది. సేఫ్టీ విషయంలో ఈ కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. కానీ, ఈ ప్రమాద తీరును చూస్తుంటే, ఈ కారు సేఫ్టీ విషయంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
కాబట్టి.. మన వద్ద ఎంత సురక్షితమైన కారు ఉన్నప్పటికీ, మన జాగ్రత్తలో మనం లేకపోయినట్లయితే, అందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పుదు. ఈ ప్రమాదాన్ని చూసైనా కొందరు మేల్కొని, నెమ్మదిగా డ్రైవ్ చేస్తారని మా డ్రైవ్స్పార్క్ బృందం ఆశిస్తోంది.