Just In
- 4 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 8 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 10 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 13 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బడ్జెట్ 2014: రహదారుల అభివృద్ధి కోసం రూ.37,800 కోట్లు
కేంద్రంలో కొత్తగా ఏర్పడిన నరేంద్ర మోడీ ప్రభుత్వం గురువారం తమ తొలి బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. చూడటానికి ఇది 2014-15 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే బడ్జెట్ అయినప్పటికీ, ఇందులోని అంశాలు మాత్రం రాబోయే అయిదేళ్లకు, ఇంకా వీలైతే మరో పదిపదిహేనేళ్లకు గట్టి ఆర్థిక, రాజకీయ పునాదిని నిర్మించడమే లక్ష్యంగా రూపొందిన బడ్జెట్గా కనిపిస్తోంది.
అచ్చే దిన్ ఆనే వాలా హై.. (మంచి రోజులు రాబోతున్నాయ్..) అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన బిజెపి సర్కారులోని ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్లో భారతదేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ధి కోసం భారీగా నిధులను కేటాయించారు. ఇందులో మొత్తం రూ.37,000 కోట్లను జాతీయ మరియా రాష్ట్రీయ రహదారుల కోసం కేటాయించారు.
ఇందులో ప్రత్యేకించి రూ.3000 కోట్లను ఈశాన్య భారతదేశంలో ఉపయోగించనున్నారు. ఈ ఏడాది దాదాపు రూ.8,500 కోట్ల వ్యయంతో జాతీయ రహదారులను నిర్మించనున్నారు. కార్ల తయారీదారుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న రోడ్డు నిర్మాణ సమస్యలకు ఈ బడ్జెట్ ఓ చక్కని పరిష్కారంగా కనిపిస్తుంది. ప్రత్యేకించి వాణిజ్య వాహనాల పరిశ్రమకు ఈ నిర్ణయం ఓ వరం లాంటింది.
ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతినే రోడ్ నెట్వర్క్ను మెరుగు పరచేందుకు గాను ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా రూ.3,000 కోట్లను మంజూరు చేయటం స్వాగతించదగిన విషయం. ఏదేమైనప్పటికీ, తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో రోడ్ నెట్వర్క్ అభివృద్ధి కోసం మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం మోటారిస్టులలో సంతోషాన్ని కలిగిస్తోంది.