Just In
- 2 hrs ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- 3 hrs ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- 17 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 20 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
Don't Miss
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Movies ‘సీరియల్స్లో తెలుగు వాళ్లను నీచంగా.. కన్నడ యాక్టర్ల ముందు పని వాళ్లకంటే హీనంగా’
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వెయిటింగ్ పీరియడ్ మరింత పెరిగింది!
ఫోర్డ్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ మోడల్ 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్' కాంపాక్ట్ ఎస్యూవీకి గిరాకీ నానాటికీ అధికమవుతోంది. దీనికి తోడు కంపెనీ ఉత్పత్తి చేస్తున్న సగటున ప్రతి ఐదు యూనిట్ల ఈకోస్పోర్ట్ ఎస్యూవీలలో ఒకదానిని విదేశాలకు ఎగుమతి చేస్తుండటంతో, భారతీయ వినియోగదారులు ఈ బుజ్జి ఎస్యూవీ కోసం బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్యూవీ విషయంలో ఉత్పత్తికి మించిన డిమాండ్ నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫోర్డ్ ఇండియా పూర్తిగా భారత మార్కెట్పై దృష్టి సారిస్తేనే, ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్ను తగ్గించడం కష్టం. అలాంటిది, ఫోర్డ్ ఇటు ఎగుమతులపై అటు దేశీయ డిమాండ్పై ఏకకాలంలో దృష్టి పెట్టడంతో ఈకోస్పోర్ట్ ఇండియన్ కస్టమర్స్ ఈ విషయంలో బలవంతంగా తమ మనస్సును మార్చుకోవాల్సి వస్తోంది.
గడచిన సంవత్సరం జూన్ నెలలో విడుదలైన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అశేషమైన ప్రజాదరణను సొంతం చేసుకుంది. విడుదలైన కొద్దివారాల్లోనే వేల సంఖ్యలో బుకింగ్లు వచ్చిపడ్డాయి. మరోవైపు అదే సమయంలో డీజిల్ వెర్షన్లో గ్లోప్లగ్ సమస్యతో ఉత్పత్తికి అంతరాయం కలగటం, ఈకోబూస్ట్ వేరియంట్ ఉత్పత్తి మితంగా ఉండటం వంటి అనేక అంశాల వలన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వెయిటింగ్ పీరియడ్ వేరియంట్ను బట్టి 6 నెలల నుంచి 9 నెలల వరకు పెరిగింది.
ఒకానొక సమయంలో ఫోర్డ్ ఇండియా డీలర్లు ఈ మోడల్ కోసం బుకింగ్లను స్వీకరించడాన్ని కూడా నిలిపివేశారు. తాజా సమాచారం ప్రకారం, ఫోర్డ్ ఇండియా డీలర్లు ఈకోస్పోర్ట్ కోసం అధిక కాలం వేచి ఉన్న కస్టమర్లను తమ ఆర్డర్లను క్యాన్సిల్ చేసుకోమని లేదా కంపెనీ అందిస్తున్న ఇతర ఐదు మోడళ్లలో దేనినైనా ఎంచుకోవాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ప్రపంచం మొత్తంలో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్యూవీని నాలుగు దేశాల్లో మాత్రమే తయారు చేస్తున్నారు. అందులో మనదేశం కూడా ఒకటి (మిగిలినవి బ్రెజిల్, చైనా, థాయ్లాండ్). భారత్ నుంచి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎగుమతులు తప్పనిసరి చేయటానికి కూడా ఇదొక కారణంగా చెప్పవచ్చు. మరోవైపు ఈకోస్పోర్ట్ భారత్లో విడుదలైన తర్వాత దీని దర రెండు సార్లు (11 శాతం) పెరిగింది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కస్టమర్లు కూడా తమ మనస్సు మార్చుకొని, ఈకోస్పోర్ట్ స్థానంలో వేరే ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు.