Just In
- 4 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 7 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 7 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 9 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- News రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Movies ఎన్టీఆర్ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ నిర్ణయం!
భారతదేశంలో 15 ఏళ్లు నిండిన వాహనాలకి కాలం చెల్లు!?
భారతదేశంలో పాత వాహనాలకు కాలం చెల్లిపోనుంది. ఇక నుంచి ఏదైనా వాహన జీవితకాలం 15 ఏళ్లు మాత్రమే కానుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం, భారతదేశంలో 15 ఏళ్లు నిండిపోయిన వాహనాలను ఢిల్లీ రోడ్ల నుంచి తొలగించి, స్క్రాప్గా మార్చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనను భారతదేశపు ఆటోమోటివ్ పరిశ్రమ కూడా స్వాగతిస్తోంది.
దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, కాలం చెల్లిపోయిన, పాత వాహనల స్థానంలో అత్యాధునిక వాహనాలను ఉపయోగించాలనే ఆలోచన కూడా ఈ నిర్ణయానికి మరో కారణం.
భారత ఆటోమోటివ్ పరిశ్రమలోని ఓ విభాగం ప్రకారం, ఇలాంటి పాతన వాహనాలను ఢిల్లీ రోడ్లపై నుంచి తొలగించడానికి బదులుగా, వీటిని స్క్రాప్గా మార్చేయాలని, లేదంటే ఇవి పక్క రాష్ట్రాలలో రిజిస్టర్ చేసుకొని, తిరిగి ఢిల్లీ రోడ్లపై వచ్చే ఆస్కారం ఉందని సదరు విభాగం భావిస్తోంది.
ఈ విషయం గురించి భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) విష్ణు మాథుర్ ప్రస్తావిస్తూ.. మోడ్రనైజేషన్ మరియు స్క్రాపింగ్ పాలసీ కోసం తాము ధీర్ఘ కాలంగా ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నామని అన్నారు.
ఈ చర్య వలన కేవలం కాలుష్యాన్ని కలిగించే వాహనాలను తొలగించడమే కాకుండా, మార్కెట్లోకి మరింత ఎక్కువ మైలేజీనిచ్చే మరియు తక్కువ కాలుష్యాన్ని కలిగించే వాహనాలకు స్వాగతం చెప్పేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన చెప్పారు.