Just In
- 2 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 4 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 7 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 8 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహీంద్రా నుంచి 4 కొత్త ఎమ్పివి, ఎస్యూవీ మోడళ్లు
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మరో నాలుగు కొత్త యుటిలిటీ వాహనాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే బొలెరో, స్కార్పియో, ఎక్స్యూవీ వంటి పాపులర్ మోడళ్లలో ఎస్యూవీ విభాగంలో మంచి బ్రాండ్ ఇమేజ్ను తెచ్చుకున్న మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పుడు మల్టీ పర్పస్ వెహికల్ (ఎమ్పివి) విభాగంలో తన బ్రాండ్ పవర్నను చూపించేందుకు సిద్ధమవుతోంది.
ప్రస్తుతం ఎమ్పివి విభాగంలో మహీంద్రా కేవలం జైలోను మాత్రమే ఆఫర్ చేస్తోంది. ఈ సెగ్మెంట్లోకి కొత్తగా ప్రవేశించిన మారుతి ఎర్టిగా, షెవర్లే ఎంజాయ్ వంటి మోడళ్ల నుంచి ఎదరవుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు కంపెనీ కొన్ని కొత్త మోడళ్లను విడుదల చేయనుంది. ఈ కొత్త వాహనాలను కంపెనీ సాఫ్ట్-రోడర్స్ లేదా యూవి-2 వెహికల్స్ అని పిలుస్తోంది.
ఈ వాహనాల అభివృద్ధిలో మహీంద్రా అండ్ మహీంద్రా స్వాధీనం చేసుకున్న దక్షిణ కొరియాకు చెందిన శాంగ్యాంగ్ సహకారం తీసుకునే అవకాశం ఉంది. వినియోగదారులకు ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన వస్తువులను ఆఫర్ చేస్తూ, ఈ సెగ్మెంట్లోని పోటీదారులకు గట్టి సవాలు విసిరేలా ఈ కొత్త యుటిలిటీ వాహనాలను మహీంద్రా తయారు చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం మహీంద్రా అందిస్తున్న యుటిలిటీ వాహనాలకు పూర్తి భిన్నంగా ఈ కొత్త వాహనాల డిజైన్ ఉంటుంది. ఈ కొత్త డిజైన్లకు ఇప్పటికే మహీంద్రా యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ప్రకటించినట్లు సమాచారం. కంపెనీ అధికారి పవన్ గోయెంకా ఓ ఆంగ్ల పత్రికకు తెలిపిన సమాచారం ప్రకారం, ఈ కొత్త వాహనాలు 'ఫ్లాంబోయెంట్' వంటి యూరోపియన్ డిజైన్ను కలిగి ఉంటాయిని వ్యాఖ్యానించారు.
ఈ కొత్త వాహనాలలో ఓ ఎమ్పివిని శాంగ్యాంగ్ ఎక్స్100 ప్లాట్ఫామ్పై తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. మరో ఉత్పత్తిని ఎక్స్యూవీ500 ఆర్కిటెక్చ్ మీద అభివృద్ధి చేయనుండగా, మూడవది అప్డేటెడ్ జైలోగా ఉంటుందని సమాచారం.