Just In
- 13 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 15 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 17 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 20 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నో డిమాండ్, నాలుగు రోజులు మహీంద్రా ప్లాంట్ బంద్
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) తమ ప్లాంట్లలో నాలుగు రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. మహీంద్రా వాహనాలకు డిమాండ్ తక్కువగా ఉన్న కారణంగా, ఇప్పటికే స్టాక్ యార్డులలో ఉన్న స్టాక్ను క్లియర్ చేసుకునేందుకే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎమ్ అండ్ ఎమ్కు భారతదేశంలో చాకన్, నాసిక్, హరిద్వార్లలో మూడు ఉత్పత్తి కేంద్రాలున్నాయి. ఈ మూడు ప్లాంట్లలో కూడా నాలుగు రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. ప్రస్తుత దేశీయ మార్కెట్ డిమాండ్కు తగినంత స్టాక్ ఇప్పటికే మహీంద్రా వద్ద ఉండటంతో, కంపెనీ కొద్దిరోజులు ఉత్పత్తిని నిలిపివేయనుంది.
గడచిన జులై నెలలో మహీంద్రా యుటిలిటీ వాహనాల అమ్మకాలు 9.91 శాతం పడిపోయి, 14,348 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో మహీంద్రా మొత్తం 15,927 వాహనాలను ఉత్పత్తి చేసింది. అంటే, కంపెనీ ఉత్పత్తి చేసిన వాహనాల కన్నా విక్రయించిన వాహనాల సంఖ్యే తక్కువ అన్నమాట.
ఈ ఏడాది ఏప్రిల్-జులై కాలానికి గమనిస్తే, మొత్తంగా మహీంద్రా యుటిలిటీ వాహనాల అమ్మకాలు 6.91 శాతం క్షిణించి 66,528 యూనిట్లుగా నమోదైంది. ఇదే సమయంలో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం కూడా 7.09 శాతం తగ్గింది. ఈ సమయంలో కంపెనీ 71,212 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది.