Just In
- 1 hr ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- 1 hr ago దిశా పటానీ కార్ల ప్రపంచం చూసారా.. చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
- 15 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 16 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
Don't Miss
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ?, తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Movies Karthika Deepam March 29th: దీపను బాధపెట్టిన ఓ వ్యక్తి... చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన కార్తీక్!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వచ్చే నెలలో కార్ల ధరలను పెంచనున్న మహీంద్రా, టాటా, హోండా
కొత్త కారును కొనేందుకు ఇదే అనువైన సమయం. ఈనెలలో (మార్చ్) కారు కొంటే మీకు ఆదాయం, అదే కారు కొనుగోలును వచ్చే నెలకు వాయిదా వేసుకుంటే మీరు మరింత అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది. ఎందుకంటే, కార్ల కంపెనీలన్నీ వచ్చే నెల (ఏప్రిల్) నుంచి ధరల పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.
గడచిన ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఎక్సైజ్ సుంకాల తగ్గింపు తర్వాత, దాదాపు అన్ని కార్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాయి. మరికొన్ని కంపెనీలు ఇదే ఊపులో అమ్మకాలను పెంచుకునేందుకు అదనపు డిస్కౌంట్లను, రాయితీలను కూడా ఆఫర్ చేశాయి. అయినప్పటికీ, పెద్దగా ఆశించిన ఫలితాలు నమోదు కాలేదు.
మరోవైపు ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలు పెరుగుపోతున్న కారణంగా టాటా మోటార్స్, హోండా కార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి పలు ఆటోమొబైల్ కంపెనీలు ఏప్రిల్ 2014 నెల నుంచి కార్ల ధరలను పెంచాలని యోచిస్తున్నాయి.
వచ్చే నెల నుంచి ధరలు పెంచే విషయమై తీవ్రంగానే కసరత్తు చేస్తున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా వెల్లడించారు. అయితే, ఏయే ఉత్పత్తులపై ఎంత మేర ధరలు పెంచనున్నారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. హోండా కార్స్ ఇండియా కూడా ధరల పెంపు ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఇకపోతే, టాటా మోటార్స్ కూడా ప్యాసింజర్ వాహనాల ధరలను 1-2 శాతం పెంచాలని చూస్తోంది.
ప్రస్తుతం దేశీయ విపణిలో హోండా కార్స్ ఇండియా అందిస్తున్న కార్ల ధరలు రూ.3.99 లక్షల నుంచి రూ.24.36 లక్షల రేంజ్లో ఉండగా, మహీంద్రా ప్యాసింజర్ వాహనాల ధరలు రూ.5.43 లక్షల నుంచి రూ.14.48 లక్షల రేంజ్లో ఉన్నాయి. గడచిన నెలలో ప్రభుత్వం కార్లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో మహీంద్రా తమ ప్యాసింజర్ వాహనాల ధరలను రూ.13,000 నుంచి రూ.49,000 రేంజ్లో తగ్గించగా, హోండా తమ కార్లపై రూ.44,741 వరకూ ధరలను తగ్గించాయి.