Just In
- 17 min ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 1 hr ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 3 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 4 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
Don't Miss
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
కొత్త మోడళ్లు, మార్కెటింగ్ కోసం రూ.4000 కోట్లు: మారుతి
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి కొత్త మోడళ్ల అభివృద్ధి కోసం భారీ పెట్టుబడులను వెచ్చించనుంది. రానున్న ఆర్థిక సంవత్సరం రూ.4,000 కోట్లు పెట్టుబడి వెచ్చించి, ఈ మొత్తాన్ని కొత్త మోడళ్లను తయారు చేయటం, మార్కెటింగ్ కార్యకలాపాలు మరియు ఆర్ అండ్ డి అభివృద్ధి కోసం వినియోగించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
గడచిన శనివారం మారుతి సుజుకి కంపెనీ బోర్డు సమావేశమై వచ్చే ఆర్థిక సంవత్సరంలో వెచ్చించనున్న పెట్టుబడుల గురించి చర్చించి వాటిని ఆమోదించింది. గుజరాత్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్లాంట్ ప్రతిపాదనకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.4,000 కోట్ల పెట్టుబడికి బోర్డు గ్రీన్ సిగ్నల్ ప్రకటించింది.
మారుతి సుజుకి గడచిన ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్పోలో సెలెరియో హ్యాచ్బ్యాక్ను విడుదల చేయటంతో పాటుగా, ఉత్పత్తికి సిద్దంగా ఉన్న ఎస్ఎక్స్4 ఎస్-క్రాస్ మరియు సియాజ్ కాన్సెప్ట్ కార్లను కూడా ప్రదర్శించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ఎస్ఎక్స్4 ఎస్-క్రాస్ త్వరలోనే మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది.
అంతేకాకుండా, మారుతి సుజుకి ఓ కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ)ని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే, ఇది వచ్చే ఏడాది ఆరంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. మారుతి సుజుకి ఇండియా తమ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డి) విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు గాను గట్టి చర్యలు తీసుకుంటోంది. హర్యానాలో ఉన్న రోహతక్ ఆర్ అండ్ డి కేంద్రాన్ని బలోపేతం చేసేందుకు కంపెనీ చర్యలు తీసుకుంది. ఈ ఆర్ అండ్ డి సెంటర్ 600 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.
ఈ
రోహతక్
ఆర్
అండ్
డి
కేంద్రంలోనే
టెస్ట్
ట్రాక్లను
ఏర్పాటు
చేయటం
ద్వారా
కొత్త
కార్లను
పరీక్షించాలని
నిర్ణయించామని,
అలాగే
ఇక్కడే
కొత్త
మోడళ్ల
రూపకల్పన
కూడా
జరుగుతుందని
కంపెనీ
తెలిపింది.
కాగా
ప్రస్తుత
ఆర్థిక
సంవత్సరం
చివరి
నాటికి
కంపెనీ
మూలధనం
రూ.3,000
కోట్ల
వరకు
కేటాయించినట్లు
పేర్కొంది.