Just In
- 13 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 15 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 15 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 17 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- Sports ఛాంపియన్లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- News క్రైస్తవ పాఠశాలపై హిందువుల దాడి
- Movies Karthika Deepam 2 పారిజాతం కళ్లలో ఆనందం కోసం బంటు.. దీపను మెప్పించిన కార్తీక్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
నవంబర్ 15 తర్వాత తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
వాహన చాలకులకు మరో తీపి కబురు. ఈనెల ఆరంభంలో లీటరుకు రూ.2 లకు పైగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈనెలలోనే మరోసారి తగ్గనున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు (క్రూడ్ ఆయిల్) ధర తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, నవంబర్ 15వ తేదీన నిర్వహించనున్న సమీక్షా సమావేశంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరను తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయి.
తాజా ట్రెండ్ ప్రకారం చూస్తే.. నవంబర్ 15వ తేదీ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 1 రూపాయికి పైగా తగ్గే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే, గడచిన ఆగస్ట్ 2014 నెల నుంచి పెట్రోల్ ధరలు వరుసగా 7వ సారి తగ్గినట్లు కాగా, డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేసిన తర్వాత దీని ధరలు వరుసగా 3వ సారి తగ్గినట్లు అవుతుంది.
గడచిన ఆగస్ట్ 2014 నుంచి చూసుకుంటే పెట్రోల్ ధర ఇప్పటి వరకు లీటరుకు రూ.9.36 వరకు తగ్గింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.64.25 గాను, లీటరు డీజిల్ ధర రూ.53.35 గాను ఉంది. దాదాపు ఐదేళ్ల తర్వాత మొట్టమొదటి సారిగా అక్టోబర్ 19, 2014వ తేదీన డీజిల్ ధరను లీటరుకు రూ.3.37 చొప్పున తగ్గించిన సంగతి తెలిసినదే.
చివరిగా డీజిల్ ధరను జనవరి 2009వ సంవత్సరంలో, ఆ తర్వాత వరుసగా దీని ధరను పెంచుకుంటూ వచ్చి, ప్రభుత్వంపై పడుతున్న సబ్సిడీ భారాన్ని కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చి, పూర్తిగా శూన్యం చేశారు. అనంతరం డీజిల్ ధరలకు స్వేచ్ఛ కల్పించారు. ప్రస్తుతం పెట్రోల్ ధరల మాదిరిగానే డీజిల్ ధరలను కూడా చమురు మార్కెటింగ్ కంపెనీలే నిర్ణయిస్తాయి.