Just In
- 12 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 15 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 17 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 21 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Movies Guppedantha Manasu April 20th: మహేంద్ర, అనుపమల కొడుకే మను.. దత్తత కన్ఫార్మ్.. జరక్కపోతే సూసైడే!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
టాటా మోటార్స్ అధ్యక్షుడిగా మయాంక్ పారీక్ నియామకం
పుకారే నిజమైంది. దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియాలో దాదాపు రెండు దశాబ్ధాలు మారుతి సుజుకి సంస్థలో వివిధ విభాగాల్లో సేవలు అందించిన మయాంక్ పారీక్ (చివరి పదవి మార్కెటింగ్ ఛీఫ్) ఇప్పుడు మరో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం కంపెనీలో చేరారు. మయాంక్ పారీక్ను తమ ప్రయాణీకుల వాహన వాణిజ్య విభాగానికి అధ్యక్షుని (ప్రెసిడెంట్)గా నియమించుకుంటున్నట్లు టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్గా మయాంక్ పారీక్ నియమితులయ్యారని, అక్టోబర్ 1, 2014వ తేదీ నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ప్యాసింజర్ మరియు వాణిజ్య వాహనల అంతర్జాతీయ వ్యాపారానికి సారధ్యం వహిస్తున్న రంజిత్ యాదవ్ బాధ్యతలను మయాంక్ పారీక్ స్వీకరించనున్నారు.
టాటా మోటార్స్లో ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించనున్న మయాంక్ పారీక్ ప్యాసింజర్ వాహన వ్యాపారానికి సంబంధించిన బాధ్యతలు స్వీకరిస్తారు. కార్పోరేట్ స్టీరింగ్ కమిటీలో కూడా ఆయన సభ్యులుగా ఉంటారు. ఆటోమొబైల్ రంగంలో పారీక్కు ఉన్న ప్రతిభ తమ కంపెనీని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సహకరించగలదని టాటా మోటార్స్ ధీమా వ్యక్తం చేసింది.
మయాంక్ పారీక్ 1982లో బిహెచ్ఈఎల్లో తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత 1991లో మారుతి ఉద్యోగ్ కంపెనీలో చేరారు. ఆయన ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి బి.టెక్ మరియు ఐఐఎమ్ బెంగుళూరు నుంచి ఎమ్బిఏ పూర్తి చేశారు. 2003లో పారీక్ మారుతి సుజుకి సేల్స్ ఛీఫ్ జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించారు.