Just In
- 1 hr ago రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- 16 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 16 hrs ago హవ్వ!.. ఇలా కూడా ఎవరైనా చేస్తారా?: నోరెళ్లబెడుతున్న నెటిజన్లు
- 18 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
Don't Miss
- Finance Gold Price: శుభవార్త.. ఆకాశం నుంచి విరిగిపడ్డ బంగారం ధర.. షాపింగ్ షురూ చేసేయండి..
- News పవన్ కల్యాణ్కు హ్యాండిచ్చిన కీలక నేత
- Sports లేడీ ఫ్యాన్ అందాన్ని చూసి కంట్రోల్ తప్పిన గిల్ Video
- Technology షియోమీ ప్రత్యేక ఈవెంట్.. బడ్స్ 5A, ప్యాడ్ SE సహా కీలక ఉత్పత్తుల విడుదల.. పూర్తి వివరాలు..!
- Movies Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
అక్టోబర్ 2017 నుంచి భారత్లో వాహన క్రాష్ టెస్ట్ తప్పనిసరి!
భారత్లో తయారవుతున్న వాహనాల భద్రత విషయంలో నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. మనదేశంలో తయారైన కార్లు భద్రతా పరంగా సురక్షితమైనవి కావని గ్లోబల్ ఎన్సిఏపి క్రాష్ టెస్ట్లు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మనదేశంలో కూడా అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా, వాహనాల భద్రత విషయంలో కొన్ని నిబంధనలను సవరించాలని సర్కారు యోచిస్తోంది.
ఇందులో భాగంగానే, అక్టోబర్ 1, 2017వ తేదీ భారత్లో వాహనాలకు క్రాష్ టెస్టులను నిర్వహించడం తప్పనిసరి చేయనుంది. ఇందుకోసం ఇండియన్ ఎన్సిఏపి (న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్)ను భారత సర్కారు ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి వాహనాల క్రాష్ టెస్టుకు కావల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
అక్టోబర్ 2017 నుంచి ఇండియాలో తయారయ్యే ప్రతి కొత్త కార్ మోడల్ కూడా గంటకు 56 కిలోమీటర్ల వేగం వద్ద క్రాష్ టెస్ట్ తప్పనిసరిగా పాస్ కావల్సి ఉంటుంది. ఏఐఎస్ 098, ఏఐఎస్ 099 క్రాష్ స్టాండర్డ్స్ ప్రకారం, ఈ టెస్టులను నిర్వహిస్తారు. ఇందులో సేఫ్టీ రేటింగ్లను స్టార్స్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. బిఎన్విఎస్ఏపి క్రాష్ టెస్టులో మేడ్ ఇన్ ఇండియా కార్లు ఐదు స్టార్లకు 5 స్టార్స్ లేదా 4-4.5 స్టార్స్ రేటింగ్ను దక్కించుకుంటే, అది సురక్షితమైన కారుగా పరిగణించడం జరుగుతుంది.
ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఓ ఇండిపెండెంట్ అథారిటీని ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ అథారిటీ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న కొత్త వాహనాల మోడళ్లను ఎంచుకొని, వాటి భద్రతా పరమైన అంశాలను సమీక్షించేందుకు ఈ టెస్ట్ కోసం పరిగణించడం జరుగుతుంది. మరి ఈ వ్యవస్థ ఎంత మేరకు విజయవంతం అవుతుందో అనేది కాలమే నిర్ణయించాలి.