Just In
- 24 min ago గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- 1 hr ago భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- 2 hrs ago రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- 4 hrs ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
Don't Miss
- News సీటు త్యాగం చేసిన ఆ ఎమ్మెల్యేకు జగన్ రాజ్యసభ హామీ-బహిరంగ ప్రకటన..!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Movies Tillu Square Collections సిద్దూ జొన్నలగడ్డ రికార్డుల మోత.. టిల్లు స్క్వేర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?
తిరిగి ప్రారంభమైన రిలయన్స్ పెట్రోల్ బంకులు
గడచిన కొన్నేళ్లుగా మూతబడి ఉన్న రియలన్స్ పెట్రోల్ బంకులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఇటీవలే డీజిల్ ధరలపై నియంత్రణలు ఎత్తివేయటంతో, దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) పెట్రోల్ బంకులు క్రమంగా రీఓపెన్ అవుతున్నాయి.
గతంలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎమ్సీ) సబ్సిడీ ధరల దెబ్బకు తట్టుకోలేక మూసేసిన వాటిలోని ఐదో వంతు (230) పెట్రోల్ బంకులలో విక్రయాలను పునఃప్రారంభించినట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. కంపెనీ తమ మూడవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించిన అనంతరం ఇన్వెస్టర్లకు ఈ విషయాన్ని తెలిపింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్చ్ 2008 ప్రాంతంలో తమకున్న మొత్తం 1,432 పెట్రోల్ బంకులను మూసివేసింది. ఇందుకు ప్రధాన కారణంగా, ఇంధనాన్ని సబ్సిడీ ధరకే విక్రయించడం వలన వచ్చిన నష్టాలే. వాస్తవానికి, ప్రభుత్వ రంగ చమురు కంపెనీల విషయంలో అయితే, ఈ సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం భరిస్తూ వచ్చేది, కానీ ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు మాత్రం తమ భారాన్ని తామే మోసుకోవాల్సి వచ్చేది. అందుకే, పెరుగుతున్న నష్టాలను తట్టుకోలేక ఆర్ఐఎల్ తమ అన్ని పెట్రోల్ బంకులను మూసివేసింది. కాగా.. మూసివేసిన తమ మొత్తం పెట్రోల్ బంకుల నెట్వర్క్ను ఒక్క ఏడాదిలోనే తిరిగి ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది.
జూన్ 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం పెట్రోలు ధరలపై నియంత్రణలను ఎత్తివేయడంతో మరో ప్రైవేటు చమురు కంపెనీ ఎస్సార్ ఆయిల్స్ కూడా తమకున్న 1,400 పైచిలుకు బంకులలో పెట్రోలు విక్రయాలను ప్రారంభించింది. తాజాగా.. డీజిల్ ధరలపై కూడా నియంత్రణలు ఎత్తి వేయడంతో, తమ పెట్రోల్ బంకులన్నింటిలో డీజిల్ ఇంధనాన్ని కూడా విక్రయిస్తామని ఎస్సార్ తెలిపింది.