Just In
- 8 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 10 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 10 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 12 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Movies ఎన్టీఆర్ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ నిర్ణయం!
2015 చివరి నాటికి 15 జీప్ డీలర్షిప్లను ఏర్పాటు చేయనున్న ఫియట్
ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ క్రైస్లర్ గ్రూప్ భారత్లో జీప్ బ్రాండ్ను ప్రవేశపెట్టనున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో చదువుకున్నాం. వాస్తవానికి గడచిన సంవత్సరమే ఫియట్ ఇండియా, తమ జీప్ వాహనాలను భారత మార్కెట్లో విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వలన అది సాధ్యం కాలేదు.
అయితే, ఈ ఏడాదిలో తప్పనిసరిగా ఫియట్ జీప్ వాహనాలు భారత్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫియట్ తమ్ జీప్ ఉత్పత్తులను ఇక్కడి మార్కెట్లో విడుదల చేయటానికంటే ముందుగా దేశవ్యాప్తంగా తమ డీలర్షిప్ నెట్వర్క్ను మరింత పటిష్టం చేసుకోనుంది. ఇందులో భాగంగా జీప్ బ్రాండ్ కోసం ప్రత్యేకంగా షోరూమ్లను ఏర్పాటు చేయనుంది.
ముందుగా ఈ ఆర్థిక సంవత్సరంలో జీప్ బ్రాండ్ కోసం దేశవ్యాప్తంగా 15 డీలర్లను ఏర్పాటు చేయనున్నారు. ఫియట్ ఏర్పాటు చేస్తున్న ఈ ప్రత్యేక షోరూమ్లలో కేవలం జీప్ వాహనాలను మాత్రమే విక్రయించనున్నారు. ప్రారంభంలో భాగంగా, ఇండియాలో జీప్ బ్రాండ్ వాహనాలను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు.
కాగా.. భవిష్యత్తులో వీటిని ఇక్కడే భారత్లోనే అసెంబ్లింగ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. జీప్ బ్రాండ్ నుంచి ముందుగా గ్రాండ్ చిరోకీ, వ్రాంగ్లర్ మోడళ్లు విడుదల కానున్నాయి. ఫియట్ ఇప్పటికే ఈ మోడళ్లను ఆర్ అండ్ డి ప్రయోజనం కోసం ఇండియాకు దిగుమతి చేసుకుంది. దేశీయ మార్కెట్లో ఇవి ఆడి క్యూ7, బిఎమ్డబ్ల్యూ ఎక్స్5, రేంజ్ రోవర్ స్పోర్ట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తాయి.