Just In
- 10 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 12 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 14 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 17 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఏప్రిల్ 2015 నుంచి పెరగనున్న థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం త్వరలోనే రెక్కలు రానున్నాయి. చిన్న కార్లపై (1000సీసీ కన్నా తక్కువ సామర్థ్యం కలిగిన కార్లపై) థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంను 107.79 శాతం వరకూ పెంచాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంచ్ అథారిటీ (ఐఆర్డీఏ) ప్రతిపాదిస్తోంది. కాగా.. ట్రక్కులలోని కొన్ని విభాగాలపై మాత్రం ప్రీమియంను తగ్గించాలని ఐఆర్డీఏ భావిస్తోంది.
కేవలం ఫోర్స్ వీలర్స్ విషయంలోనే కాకుండా టూవీలర్స్ విషయంలో కూడా ఇన్సూరెన్స్ను పెంచాలని ఐఆర్డీఏ ప్రతిపాదించింది. ఈ విభాగంలో 75-350సీసీ సెగ్మెంట్ క్రిందకు వచ్చే ద్విచక్ర వాహనాలపై ఇన్సూరెన్స్ ప్రీమియం 14.32 శాతం పెంచాలని, 350సీసీ సామర్థ్యానికి మించిన ద్విచక్ర వాహనాలపై ఇన్సూరెన్స్ ప్రీమియంను 61 వరకూ తగ్గించాలని యోచిస్తోంది.
వాహన ఇన్సూరెన్స్ ప్రీమియం పెరగడానికి ప్రధాన కారణం యాక్సిడెంట్లు పెరుగుతుండటం, ఫలితంగా వస్తున్న క్లెయిమ్ల సంఖ్య కూడా పెరుగుతుండటమే. ఐఆర్డీఏ ప్రకారం, డెత్ క్లెయిమ్లకు చెల్లిన సగటు పరిహారం నానాటికీ పెరుగుతోంది. గత 2012-13 ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన సగటు డెత్ క్లెయిమ్ రూ.5,45,174. కాగా.. 2013-14లో ఇది రూ.6,09,152కి పెరిగింది.
వాహన బీమా ప్రీమియం పెంపు విషయంలో ఐఆర్డీఏ చేసిన ఈ ప్రతిపాదనపై అభిప్రాయ సేకరణ చేపట్టింది. మార్చ్ 20, 2015 వరకూ స్టేక్హోల్డర్స్ నుంచి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. మరి ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయం ఏంటో మా పాఠకులతో పంచుకోగలరు.