Just In
- 11 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 12 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 14 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 17 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
డీజిల్ ఇంజ్లను స్థానికంగానే అసెంబ్లింగ్ చేయనున్న ఫోక్స్వ్యాగన్ ఇండియా
జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్వ్యాగన్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న డీజిల్ కార్లలో ఉపయోగించే ఇంజన్లను ఇప్పటి వరకూ సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని, తమ వాహనాల్లో ఉపయోగించేంది. అయితే, ఇకపై ఫోక్స్వ్యాగన్ ఇండియా తమ డీజిల్ ఇంజన్లను భారతదేశంలోనే అసెంబ్లింగ్ చేయనుంది.
ఈ మేరకు ఫోక్స్వ్యాగన్ ఇండియా, పూనేలోని చాకన్ పారిశ్రామిక ప్రాంతం వద్ద ఓ డీజిల్ ఇంజన్ అసెంబ్లింగ్ యూనిట్ను ప్రారంభించింది. మొత్తం 3500 చ.మీ. విస్తీర్ణంలో, దాదాపు రూ.240 కోట్ల పెట్టుబడిని వెచ్చించి, ఈ ప్లాంట్ను నిర్మించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి డేవంద్ర ఫడ్నవిస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్లాంట్ను ప్రారంభించారు.
ఫోక్స్వ్యాగన్ ఇండియా ప్రారంభించిన ఈ అసెంబ్లింగ్ లైన్లో ప్రత్యేకించి డీజిల్ ఇంజన్లను మాత్రమే తయారు చేయనున్నారు. ఈ ఇంజన్లను కంపెనీ విక్రయిస్తున్న పోలో హ్యాచ్బ్యాక్, వెంటో సెడాన్ కార్లలో ఉపయోగించనున్నారు. అలాగే.. ఫోక్స్వ్యాగన్ గ్రూపుకి చెందిన స్కొడా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ర్యాపిడ్ సెడాన్లో కూడా ఇవే డీజిల్ ఇంజన్లను ఉపయోగించనున్నారు.
ఫోక్స్వ్యాగన్ ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్లో సాలీనా 98,000 యూనిట్ల డీజిల్ ఇంజన్లను ఉత్పత్తి చేయవచ్చు. ఇప్పటి వరకూ ఫోక్స్వ్యాగన్ భారత్లో ఆఫర్ చేస్తున్న 1.5 డీజిల్ ఇంజన్ను పోలాండ్ నుంచి దిగుమతి చేసుకునేది. ఇకపై, ఈ ఇంజన్లను భారత్లోనే అసెంబ్లింగ్ చేయనున్నారు. ఈ డీజిల్ ఇంజన్లను స్థానికంగానే అసెంబ్లింగ్ చేస్తున్నప్పటికీ, వాహనాల ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని కంపెనీ స్పష్టం చేసింది.