Just In
- 6 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 7 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 8 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 9 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- Movies ఆ పార్టీ ఎంపినే గెలిపించండి.. ప్యాకేజ్ తీసుకొని చెప్పడం లేదు.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జిఎస్టి దెబ్బకు భారీగా దిగివచ్చిన ఆడి కార్ల ధరలు
దేశ వ్యాప్తంగా జూలై 1, 2017 న జిఎస్టి అమలుకానుంది. జిఎస్టి అమలుకావడానికి ముందే ఆడి తమ ఏ3, ఏ4, ఏ6 మరియు క్యూ3 కార్ల మీద ప్రి-జిఎస్టి ఆఫర్లను ప్రకటించింది.
దేశ వ్యాప్తంగా జూలై 1, 2017 న జిఎస్టి అమలుకానుంది. జిఎస్టి అమలుకావడానికి ముందే ఆడి తమ ఏ3, ఏ4, ఏ6 మరియు క్యూ3 కార్ల మీద ప్రి-జిఎస్టి ఆఫర్లను ప్రకటించింది. జిఎస్టి అమలు అయితే తగ్గనున్న కార్ల ధరలను ఆడి ముందుగానే తగ్గించింది.
పూర్తి స్థాయిలో జిఎస్టికి ఆమోదం లభించిన తరువాత జూలై 1, 2017 నుండి అమల్లోకి తీసుకురానున్న సంగతి తెలిసిందే. అయితే ఆటోమొబైల్ పరిశ్రమ మీద నిర్ణయించిన జిఎస్టిలో ఎప్పటికప్పుడుమార్పులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో కార్ల ధరల్లో మార్పులు ఏ మేరకు ఉంటాయన్న విశయంలో ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.
ఇప్పటికే డీలర్ల వద్ద ఉన్న స్టాక్ క్లియర్ చేసుకోవడానికి కార్ల ధరలు తగ్గుముఖం పట్టనున్న తయారీ సంస్థలు తమ కార్ల మీద ప్రి జిఎస్టి పేరుతో భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. డీలర్లు నష్టపోకుండా, జిఎస్టి అమలయ్యే నాటికి మొత్తం స్టాక్ క్లియర్ చేయడమే లక్ష్యంగా ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.
ఇదే బాటలో నడుస్తున్న ఆడి ఇండియా విభాగం, ఏ3 ప్రీమియ్ ప్లస్ టిడిఐ డీజల్ వెర్షన్ ధర రూ. 32.30 లక్షలు ఉండగా, దీనిని రూ. 29.99 లక్షల ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధరతో అందుబాటులో ఉంచింది.
అదే విధంగా ఏ4, ఏ6 మరియు క్యూ3 ల కొనుగోలు దారులు రూ. 6 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ప్రత్యేకించి ఆడి ఏ6 డీజల్ సెడాన్ మీద కొన్ని నగరాల్లో రూ. 7 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది.
ఆడి ఇండియా విభాగానికి మంచి విక్రయాలు సాధించిపెడుతున్న క్యూ3 ఎస్యూవీ మీద రూ. 4 లక్షల వరకు, పరిమాణం పరంగా పెద్ద ఎస్యూవీలుగా పేరుగాంచిన క్యూ5 మరియు క్యూ7 ఎస్యూవీల మీద గణనీయమైన డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది.
జూలై 1, 2017 నుండి దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను విధానం వస్తు సేవల పన్ను అమల్లోకి రానున్న తరుణంలో, ఇండియాలో లగ్జరీ కార్లను తయారీ చేస్తున్న సంస్థలు బిఎమ్డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ కూడా తమ ఉత్పత్తుల మీద ముందస్తు జిఎస్టి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
అన్ని ఆటోమొబైల్స్ మీద నిర్దిష్టంగా 28 శాతం పన్నును నిర్ణయించింది. అయితే గతంలో లగ్జరీ కార్ల మీద ట్యాక్స్ 55శాతముగా ఉండేది. 55 నుండి 28 శాతానికి ట్యాక్స్ దిగిరావడంతో లగ్జరీ కార్ల కంపెనీలు భారీగా డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి.