Just In
- 1 hr ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- 3 hrs ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- 16 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 20 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
Don't Miss
- News చిన్న రాయితో కొడితే హత్యాయత్నం అవుతుందా?
- Movies ‘సీరియల్స్లో తెలుగు వాళ్లను నీచంగా.. కన్నడ యాక్టర్ల ముందు పని వాళ్లకంటే హీనంగా’
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
జిఎస్టిలో సవరణ: వాహన రంగంపై సెస్ ఎత్తివేసిన కేంద్రం
ఏకీకృత పన్ను విధానం సేల్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ద్వారా వాహన రంగంపై అమలు కానున్న తొలగిస్తున్నట్లు కేంద్ర తెలిపింది. అనగా నిర్ధిష్ట టాక్స్ మినహాయిస్తే, అదనపు సెస్ ను చెల్లించాల్సిన అవసరం లేదు.
నూతన పన్ను విధానం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనుగుణంగా కార్లు మరియు బైకుల మీద నిర్ధిష్ట పన్ను 28 శాతం తో పాటు వాహనాల రేంజ్ ఆధారంగా 1 నుండి 3 శాతం వరకు సెస్ చెల్లించాలని కేంద్రం ప్రభుత్వం జిఎస్టిలో పొందుపరించింది. అయితే అన్ని వాహననాల మీద నిర్ధిష్ట పన్ను 28 శాతం మినహాయిస్తే, ఎలాంటి సెస్ చెల్లించనవసరం లేదని ప్రకటించింది.
పరిశ్రమల(డెవలప్మెంట్ మరియు రెగ్యులేషన్) చట్టం 1951 అనుగుణంగా, 2017 పన్ను విధింపు సవరణ చట్టం ప్రకారం - ఆటోమొబైల్స్ (కార్లు మరియు బైకులు) మీద ఎలాంటి సెస్ చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జిఎస్టి మేరకు, 1,200సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న పెట్రోల్ కార్లు మీద 28 శాతం ట్యాక్స్తో పాటు 1 శాతం సెస్ చెల్లించాలి, అదే విధంగా 1,500సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న డీజల్ కార్లు మీద 28 శాతం ట్యాక్స్తో పాటు 3 శాతం సెస్ చెల్లించాల్సి ఉండేది.
టూ వీలర్ల విషయానికి వస్తే, 350సీసీ కన్నా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లు 28 శాతం ట్యాక్స్ చెల్లిస్తూ, అదనంగా మూడు శాతం సెస్ చెల్లించాలని జిఎస్టిలో పొందుపరిచింది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో జూలై 1, 2017 నుండి అమల్లోకి రానున్న జిఎస్టి ప్రకారం, కార్లు మరియు బైకులు రెండింటి మీద ఉన్న 28 శాతం ట్యాక్స్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. వీటి మీద ఉన్న సెస్ను పూర్తిగా తొలగించింది.
వస్తు మరియు సేవల పన్ను సులభంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల సెస్లను ఎత్తివేస్తూ వస్తు సేవల పన్ను(GST)ను మరింత సులభతరం చేసే క్రమంలో వాహన రంగం మీద ఉన్న అన్ని రకాల సెస్ ఎత్తివేసింది.
చిన్న కార్ల మీద సెస్ అధికంగా ఉండటంతో చిన్న కార్ల ఉత్పత్తి విక్రయాలతో పాటు ఎగుమతుల మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతున్న ఇండియన్ ఆటోమొబైల్ నిపుణులు ఆందోళన చెందారు. దీంతో దేశీయ చిన్న కార్ల పరిశ్రమ కుదేలయ్యే అవకాశం కూడా కనిపించింది.