Just In
- 17 min ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 1 hr ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- 3 hrs ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- 4 hrs ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
Don't Miss
- News సీట్ల మార్పులో బీజేపీ కొత్త ట్విస్ట్- చంద్రబాబు నిర్ణయం ఏంటి..!!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Sports రోహిత్పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Movies ‘సీరియల్స్లో తెలుగు వాళ్లను నీచంగా.. కన్నడ యాక్టర్ల ముందు పని వాళ్లకంటే హీనంగా’
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
జిఎస్టి ఎఫెక్ట్ - కొత్త కార్ల కొనుగోళ్ల మీద భారీ డిస్కౌంట్స్
ఒకే పన్ను విధానంతో వాహన రంగం మీద ట్యాక్స్ మునుపటితో పోల్చుకుంటే స్వల్పంగా తగ్గింది. దీంతో దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల మీద భారీ డిస్కౌంట్స్ ప్రకటించాయి.
ఏకీకృత పన్ను విధానం కోసం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను(GST) విధానం కొన్ని సెక్టార్లను కుదిపేసినప్పటికీ, మరికొన్నింటి మీద ట్యాక్స్ తగ్గింపుకు కారణమైంది. దీంతో కొన్ని ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు జిసిటి ద్వారా ట్యాక్స్ తగ్గుముఖం పట్టడంతో తమ ఉత్పత్తుల మీద కొనుగోలు మీద భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి.
ఎస్యూవీల తయారీ సంస్థగా పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఉత్పత్తుల మీద భారీ మొత్తం మీద డిస్కౌంట్లను ప్రకటించింది. మహీంద్రా ఎక్స్యూవీ500లోని డబ్ల్యూ4 వేరియంట్ మీద రూ. 49,000 లు ప్రకటించింది.
ఎక్స్యూవీ500 లోని డబ్ల్యూ6 మరియు డబ్ల్యూ8 మీద రూ. 73,000 లు మరియు డబ్ల్యూ10 మీద రూ. 84,000 ల వరకు తగ్గింపు ప్రకటించింది.
మహీంద్రా లైనప్లో యంగ్ ఎస్యూవీగా విపణిలోకి వచ్చిన కెయువి100 లోని కె2 మరియు కె4 డీజల్ వేరియంట్ల మీద రూ. 34,000 లు అదే విధంగా కె4 మరియు కె6 పెట్రోల్ వేరియంట్ల మీద రూ. 34,600 లు మరియు టాప్ ఎండ్ వేరియంట్ కె8 మీద రూ. 43,000 ల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది.
మారుతి సుజుకి
భారత దేశపు అతి పెద్ద దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ ఇగ్నిస్ క్రాసోవర్ హ్యాచ్బ్యాక్ కారు మీద గరిష్టంగా రూ. 3,400 ల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.
హ్యుందాయ్ మోటార్స్
మరో దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ తమ ఉత్పత్తుల మీద ఎలాంటి డిస్కౌంట్లను ప్రకటించలేదు. అయితే ఓ కొత్త వాగ్దానం చేసింది, ఇప్పుడు కొనుగోలు చేసే కస్టమర్లకు జిఎస్టి అమలైన తరువాత తగ్గుముఖం పట్టిన ట్యాక్స్ను లెక్కించి కస్టమర్లకు వెనక్కి చెల్లిస్తామని చెబుతోంది.
వస్తు సేవల పన్నులో పొందుపరిచిన ట్యాక్స్ వివరాల మేరకు, చిన్న కార్ల మీద స్వల్పంగా ట్యాక్స్ పెరగడంటో వాటి ధరలు రూ. 3,000 ల వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే పెద్ద వాహనాల మీద ట్యాక్స్ తగ్గడంతో ఎస్యూవీ మరియు లగ్జరీ వాహనాల ధరలు రూ. 60,000 వరకు తగ్గనున్నాయి.
జిఎస్టిలోని స్లాబుల్లో ట్యాక్స్ తగ్గించడంతో, కార్ల ధరలు తగ్గముఖం పట్టాయి. మరియు ఈ ట్యాక్స్ తగ్గింపు వలన కలిగే ఫలితాలు కస్టమర్లకు అందనున్నాయి. ప్రస్తుతం అన్ని ప్యాసింజర్ వాహనాల మీద గరిష్టంగా ఉన్న నిర్ధిష్ట పన్ను 28 శాతంగా ఉంది.
దీనికి తోడు జిఎస్టి మండలి 1,200సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న పెట్రోల్ కార్ల మీద 1 శాతం సెస్ అదే విధంగా 1,500సీసీ కన్నా తక్కువ సామర్థ్యం డీజల్ కార్ల మీద 3 శాతం సెస్ మరియు 15 శాతం సెస్ ను పెద్ద ఎస్యూవీలు మరియు లగ్జరీ ప్యాసింజర్ వాహనాల మీద అమలు చేయనున్నారు. అంటే సెస్ మరియు నిర్ధిష్ట ట్యాక్స్ల కలయిక ప్రభుత్వానికి కార్ల తయారీ సంస్థలు చెల్లిస్తాయి. దీనిని వాహనం యొక్క ఎక్స్-షోరూమ్ ధరలో మిళితం చేస్తారు.
ఏకీకృత పన్ను విధానం పెద్ద ప్యాసింజర్ కార్ల ఉత్పత్తుల తయారీ సంస్థలకు మంచి లాభాలను చేకూర్చనుంది. కేవలం ఎస్యూవీలను మాత్రమే ఉత్పత్తి చేస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా మరియు టయోటా లకు కలిసొచ్చే అవకాశం ఉంది. మరియు లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, ఆడి ఉత్పత్తుల మార్కెట్ మరింత పెరగనుంది.