Just In
- 12 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 15 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 17 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 21 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- Movies Guppedantha Manasu April 20th: మహేంద్ర, అనుపమల కొడుకే మను.. దత్తత కన్ఫార్మ్.. జరక్కపోతే సూసైడే!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సియాజ్ హైబ్రిడ్ విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తే లేదంటున్న మారుతి
మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో అందుబాటులో ఉన్న తమ కార్ల మీద నూతన ట్యాక్స్ విధానం ప్రకారం ధరలు పెరిగినప్పటికీ వాటిని మార్కెట్ నుండి తొలగించకుండా, యథావిధిగా విక్రయిస్తామని ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం నూతన ట్యాక్స్ విధానం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(GST)ని అమల్లోకి తెచ్చిన తర్వాత దేశీయ వాహన పరిశ్రమలో ఊహించని పరిణాలు చోటు చేసుకుంటూ వచ్చాయి.
కాలుష్యాన్ని అధికంగా విడుదల చేసే పెట్రోల్ మరియు డీజల్ కార్ల ధరలు తగ్గుముఖం పట్టగా, పర్యావరణానికి మేలు కలిగించే ఎకో ఫ్రెండ్లీ కార్ల మీద ట్యాక్స్ విపరీతంగా పెరగడంతో హైబ్రిడ్ కార్ల ధరలు భారీగా పెరిగాయి.
హైబ్రిడ్ కార్ల ధరలు పెరిగిన నేపథ్యంలో తక్కువ పొగను వెదజల్లి, ఎక్కువ మైలేజ్నిచ్చే పర్యావరణ హితమైన కార్లను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. జిఎస్టి కారణంగా హైబ్రిడ్ కార్ల మీద ట్యాక్స్ పెరగడంతో కొన్ని కార్ల తయారీ సంస్థలు తమ హైబ్రిడ్ కార్లను మార్కెట్ నుండి తొలగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి.
అయితే మారుతి సుజుకి ఈ విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తే లేదని తెలిపింది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో అందుబాటులో ఉన్న తమ కార్ల మీద నూతన ట్యాక్స్ విధానం ప్రకారం ధరలు పెరిగినప్పటికీ వాటిని మార్కెట్ నుండి తొలగించకుండా, యథావిధిగా విక్రయిస్తామని ప్రకటించింది.
ప్రస్తుతం మారుతి సుజుకి లైనప్లో సియాజ్ మరియు ఎర్టిగా ఎమ్పీవీలు మైల్డ్ హైబ్రిడ్ పరిజ్ఞానంతో లభిస్తున్నాయి. జిఎస్టి అమలైన కారణంగా, వీటి ధరలు సుమారుగా రూ. 1 లక్ష వరకు పెరిగాయి. జిఎస్టి లోని లగ్జరీ స్లాబులకు వర్తించే ట్యాక్స్ను ఎకో ఫ్రెండ్లీ కార్లకు కూడా అమలు చేయడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం ఫ్రెండ్లీ కార్ల మీద 28 శాతం నిర్ధిష్ట ట్యాక్స్ మరియు 15 శాతం అదనపు సెస్ కలుపుకొని మొత్తం 43 శాతంగా ట్యాక్స్ నిర్ణయించారు. అయితే గతంలో హైబ్రిడ్ వెహికల్స్ మీద అన్ని పన్నులతో సహా గరిష్టంగా 30.3 శాతం ట్యాక్స్ మాత్రమే అమలయ్యేది. సుమారుగా 12.7 శాతం ట్యాక్స్ పెరగడంతో ఈ మేరకు హైబ్రిడ్ కార్ల ధరలు పెంపు బాట పట్టాయి.
మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి అయుకవా మాట్లాడుతూ, "తమ వద్ద లభించే అన్ని కార్లలో హైబ్రిడ్ పరిజ్ఞానాన్ని అందివ్వాలని నిర్ణయించుకున్నప్పుడు, ఒక లక్ష్యంతో పర్యావరణహితమైన ఎకో ఫ్రెండ్లీ కార్లను అభివృద్ది చేయడం జరిగింది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా తమ అన్ని కార్లలో కూడా హైబ్రిడ్ పరిజ్ఞానాన్ని అందించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు."
ఇండియాలో జిఎస్టి కారణంగా హైబ్రిడ్ కార్ల ధరలు పెరిగితే, హైబ్రిడ్ కార్ల అభివృద్ది, తయారీ మరియు విక్రయాల పరంగా వెనక్కి తగ్గేది లేదని మారుతి సుజుకి పరోక్షంగా స్పష్టం చేస్తోంది.
అయితే, భారత ప్రభుత్వం హైబ్రిడ్ కార్ల ట్యాక్స్ గురించి పునరాలోచన చేసి, ట్యాక్స్ తగ్గిస్తే బాగుంటుందని మారుతి భావిస్తోంది. నిజానికి కాలుష్య కారకాలైన కార్ల మీద ట్యాక్స్ తగ్గించడం, తక్కువ కాలుష్య కారకాలైన హైబ్రిడ్ కార్ల మీద ట్యాక్స్ పెంచడం ఎంతవరకు సరైనదో కేంద్రానికే తెలియాలి మరి!