భారీగా పెరిగిన ఇంధన ధరలు

లీటర్ పెట్రోల్ మీద రూ. 1.29 లు మరియు లీటర్ డీజల్ మీద 97 పైసల వరకు ధరలు పెంచినట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఆదివారం రాత్రి ప్రకటించాయి.

By Anil

నూతన సంత్సరం దేశీయులకు ఒక చేదు వార్త మోసుకొచ్చింది. కొత్త ఏడాది మొదటి రోజే పెట్రోల్ మరియు డీజల్ ధరలు భారీ పెంపునకు గురయ్యాయి. లీటర్ పెట్రోల్ మీద రూ. 1.29 లు మరియు లీటర్ డీజల్ మీద 97 పైసల వరకు ధరలు పెంచినట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఆదివారం రాత్రి ప్రకటించాయి. నూతన ధరలు ఆదివారం అర్థ రాత్రి (01/01/2017) నుండి అమల్లోకి వచ్చాయి.

పెరిగిన ఇంధన ధరలు

ధరల పెంపుతో పాటు రాష్ట్రాలు విధించే సుంకాన్ని కలుపుకుంటే దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల వారీగా పెట్రోల్ మరియు డీజల్ ధరలు అధికంగా ఉండే అవకాశం ఉంది. చివరిసారి డిసెంబర్ 17, 2016 న చేసిన ధరల సవరణల్లో పెట్రోల్ మీద రూ. 2.21 లు మరియు డీజల్ మీద రూ. 1.79 లు పెరిగిన సంగతి తెలిసిందే.

పెరిగిన ఇంధన ధరలు

ఇది ఆరంభం మాత్రమే గత సంవత్సరంలో చమురు సంస్థలు ఇంధన ధరల పెంపును ప్రకటించిన సమయాన్ని పరిశీలిస్తే ప్రతి మాసానికి రెండు సార్లు ధరల సవరణలు చేసేవి. కాబట్టి ఈ ఏడాది కూడా ప్రతి మాసంలో రెండు సార్లు ధరల సవరణలు చేస్తూ వినియోగదారుల నడ్డి విరచడం ఖాయం.

పెరిగిన ఇంధన ధరలు

  • రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రెడ్డిచ్ విడుదల: ధర మరియు ఇతర వివరాలు..
  • స్పోర్టివ్ లక్షణాలు, కత్తెర డోర్లతో మోడిఫికేషన్ కు గురైన మారుతి బాలెనో
  • ఫ్రాన్స్ లో ప్రపంచపు మొట్టమొదటి సౌర ఫలక రహదారి ప్రారంభం

Most Read Articles

English summary
Petrol price hiked by Rs 1.29 a litre, diesel by 97 paise
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X