Just In
- 12 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 13 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 15 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 18 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బెర్లిన్ వ్యాపారవేత్తను వరించిన తొలి ఫోక్స్వ్యాగన్ ఎక్స్ఎల్1
ప్రముఖ జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్వ్యాగన్, లీటరు ఇంధనానికి 100 కిలోమీటర్లకు పైగా మైలేజీనిచ్చేలా తయారు చేసిన ఫోక్స్వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు ఇతర కాన్సెప్ట్ కార్ల మాదిరిగా కేవలం కాన్సెప్ట్ దశకే పరిమితం కాకుండా, ఉత్పత్తి దశకు కూడా చేరుకుంది. అంతేకాదు, ఉత్పత్తి దశ దాటి మొదటి కస్టమర్ వద్దకు కూడా చేరిపోయింది.
ఫోక్స్వ్యాగన్ ఎక్స్ఎల్1 తొలి హైబ్రిడ్ కారును బెర్లిన్కు చెందిన వ్యాపారవేత్తను వరించింది. మెక్కిన్సే అండ్ కంపెనీ డైరెక్టర్ డా. క్రిస్టియన్ మలోర్నీ మొట్టమొదటి ఫోక్స్వ్యాగన్ ఎక్స్ఎల్1 కారును కొనుగోలు చేశారు. జర్మనీలోని డ్రెస్డెన్లో ఉన్న ట్రాన్స్పరెంట్ ఫ్యాక్టరీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఫోక్స్వ్యాగన్ అధికారులు ఈ కారు తాళం చెవులను మలోర్నీకి అందజేశారు.
మరింత
సమాచారం
తర్వాతి
సెక్షన్లో..
మరిన్ని
వివరాలను
ఈ
ఫొటో
ఫీచర్లో
పరిశీలించండి..!
తొలి ఫోక్స్వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారును అందుకుంటున్న మెక్కిన్సే అండ్ కంపెనీ డైరెక్టర్ డా. క్రిస్టియన్ మలోర్నీ.
గత కొద్ది సంవత్సరాలుగా ఫోక్స్వ్యాగన్ తమ ఎక్ఎల్స్1 కాన్సెప్ట్పై పనిచేస్తోంది. తాజాగా.. గడచిన సంవత్సరం మార్చ్ నెలలో జెనీవాలో జరిగిన 83వ అంతర్జాతీయ మోటార్ షోలో ఇందులో ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న ప్రొడక్షన్ వెర్షన్ను ప్రదర్శించింది.
ఫోక్స్వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు డీజిల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో నడుస్తుంది. ఇందులో 47 బిహెచ్పి, ట్విన్-సిలిండర్, 800 సీసీ, టర్బో డీజిల్ ఇంజన్ను, అలాగే, 27 బిహెచ్పి ఎలక్ట్రిక్ మోటార్లను అమర్చారు.
ఈ రెండు మోటార్లలో డీజిల్ ఇంజన్ రెగ్యులర్ డీజిల్తో నడుస్తుంది. ఇకపోతే ఎలక్ట్రిక్ మోటార్ మాత్రం కారులో అమర్చిన 5.5 కిలోవాట్ బ్యాటరీ సాయంతో నడుస్తుంది.
ఫోక్స్వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు బరువును తేలికంగా ఉంచేందుకు గానూ దీని బాడీ నిర్మాణంలో ఎక్కువ భాగం ధృఢమైన కార్బన్ ఫైబర్ను ఉపయోగించారు. ఫలితంగా ఈ కారు నుంచి అధిక మైలేజ్ రాబట్టడం సాధ్యమైంది.
ఫోక్స్వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు మొత్తం బరువు 795 కేజీలు మాత్రమే. ఈ కారులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఫోక్స్వ్యాగన్ ఎక్స్ఎల్1 హైబ్రిడ్ కారు లీటరు ఇంధనానికి 111.16 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.
ఫోక్స్వ్యాగన్ ఎక్స్ఎల్1 3.8 మీటర్ల పొడవును, 1.66 మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 159.9 కిలోమీటర్లు. ఇది 12.7 సెకండ్ల వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 160 కి.మీ.
ఫోక్స్వ్యాగన్ ఎక్స్ఎల్1 కారులో 10 లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్ ఉంటుంది. ఈ ఇంధనం సాయంతో 49.8 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. డీజిల్, బ్యాటరీ పవర్తో కలిపి ఈ కారులో 499 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.
దీని ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ, ఇది లక్ష డాలర్లు ఉండొచ్చని అంచనా. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.54 లక్షలకు పైమాటే (పన్నులు కలుపుకోకుండా).
ఇలాంటి కార్లు ఇండియాకి కూడా వస్తే ఎంత బాగుంటుందో కదా..!