Just In
- 45 min ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 2 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 3 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 5 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News సూర్య గోచారంతో మే 13వరకు ఈ రాశులకు సంపద వర్షం
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Movies నీకెంత బలుపు? ఆర్కే నాయుడుపై సీనియర్ నటి సీరియస్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
గో ప్లస్ ఎమ్పివి స్పెసిఫికేషన్స్ను వెల్లడి చేసిన డాట్సన్!
జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్, ఇటీవల పునఃప్రవేశపెట్టిన తమ పురాతన కార్ బ్రాండ్ డాట్సన్ క్రింద తక్కువ ధర కలిగిన ఎంట్రీ లెవల్ కార్లను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, డాట్సన్ బ్రాండ్ కంపెనీ ఇప్పటికే ఇండియాలో గో హ్యాచ్బ్యాక్ను అలాగే ఇండోనేషియాలో గో ప్లస్ ఎమ్పివిలను ఆవిష్కరించింది.
ఈ రెండు ఉత్పత్తుల్లో తొలుత భారత మార్కెట్లో డాట్సన్ గో విడుదల కానుంటే, ఇండోనేషియన్ మార్కెట్లో డాట్సన్ గో ప్లస్ ఎమ్పివి విడుదల కానుంది. ఇవి రెండూ వచ్చే ఏడాది ఆరంభం నాటికి విడుదల కావచ్చని సమాచారం. కాగా.. తొలుత ఇండోనేషియాలో విడుదల కానున్న డాట్సన్ గో ప్లస్ ఎమ్పివికి సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ తాజాగా విడుదల చేసింది.
ఆ
వివరాలేంటో
తెలుసుకుందాం
రండి..!
ఇండోనేషియన్ మార్కెట్లో విడుదల కానున్న డాట్సన్ గో ప్లస్ ఎమ్పివిలో 1.2 లీటర్, త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ను ఉపయోగించనున్నారు. (ఇది నిస్సాన్ మైక్రాలో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్కు రీట్యూన్డ్ వెర్షన్). డాట్సన్ గో హ్యాచ్బ్యాక్ కారులో కూడా ఇదే ఇంజన్ను ఉపయోగించే ఆస్కారం ఉంది.
డాట్సన్ గో ప్లస్లో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 68 పిఎస్ల శక్తిని, 104 ఎన్ఎమ్ల టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్ను కూడా కంపెనీ విడుదల చేసే అవకాశం ఉంది.
డాట్సన్ గో ప్లస్ ఎమ్పివి మైలేజ్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, దీని లైట్ వెయిట్ నిర్మాణం కారణంగా ఇది మెరుగైన మైలేజీని ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది. దీని మొత్తం బరువు 794 కేజీలు మాత్రమే. ఇది మారుతి సుజుకి ఎర్టిగా బరువు కన్నా 386 కేజీలు తేలికైనది.
డాట్సన్ గో ప్లస్ ఎమ్పివి ఉత్పత్తి ఖర్చును తక్కువగా ఉంచేందుకు గాను ఇందులో 13 ఇంచ్ చక్రాలను మాత్రమే ఉపయోగించారు. ఇవి 155/70 టైర్లతో కవర్ చేయబడి ఉంటాయి.
డాట్సన్ గో ప్లస్ ఓ కాంపాక్ట్ ఎమ్పివి. అంటే, ఇది 7 సీటింగ్ (2+3+2) కెపాసిటీని ఆఫర్ చేస్తున్నప్పటికీ, పొడవులో మాత్రం నాలుగు మీటర్ల కన్నా తక్కువగానే ఉంటుదన్నమాట. దీన్నిబట్టి చూస్తే, ఇందులో ఇంటీరియర్స్ చాలా ఇరుకుగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
డాట్సన్ గో ప్లస్ ఎమ్పివి 3995 మి.మీ పొడవును, 1635 మి.మీ వెడల్పును 1485 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్ బేస్ 2450 మి.మీలుగా ఉంటుంది.
డాట్సన్ గో ప్లస్ రెడ్డిష్ గోల్డ్, వైట్ సాలిడ్, సిల్వర్ మెటాలిక్, గ్రే మెటాలిక్, బ్లాక్ సాలిడ్ అనే ఐదు రంగులలో లభ్యం కానుంది. దీని ధర సుమారు రూ.5 లక్షల రేంజ్లో ఉండొచ్చని అంచనా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు డ్రైవ్స్పార్క్ను గమనిస్తూనే ఉండండి.