Just In
- 52 min ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 4 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 6 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 14 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
Don't Miss
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Movies Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
బడ్జెట్లో ఎక్సైజ్ డ్యూటీ కట్; దిగిరానున్న వాహనాల ధరలు
కార్ మేకర్లకు ఇదొక తీపి కబురు. మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, కేంద్ర సర్కారు తాజాగా ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2014-15లో వాహనాలపై ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గించారు. గడచిన రెండేళ్లుగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న భారత ఆటోమొబైల్ పరిశ్రమకు కాస్తంత ఊరట కలిగిస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
ఆర్థిక మంత్రి తెలిపిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు మరియు వాణిజ్య వాహనాలపై 12 శాతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 8 శాతానికి తగ్గించారు (మొత్తం 4 శాతం తగ్గింపు విధించారు). అలాగే, మిడ్-సైజ్ సెడాన్లపై సుంకాన్ని 24 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు (4 శాతం తగ్గింపు).
ఇకపోతే, గడచిన బడ్జెట్లో ఎస్యూవీలపై భారీగా సుంకాన్ని పెంచిన (30 శాతానికి) సంగతి తెలిసినదే. కాగా.. ప్రస్తుత బడ్జెట్లో ఈ సుంకాన్ని ఏకంగా 6 శాతం తగ్గించి 30 శాతం నుంచి 24 శాతానికి దిగివచ్చేలా చేశారు.
అన్ని రకాల వాహనాలపై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గిన నేపథ్యంలో, కార్ మేకర్లు ఈ ప్రయోజనాన్ని వినియోగదారులపై బదిలీ చేసినట్లయితే, టొయోటా ఇన్నోవా వంటి వాహనాలపై కస్టమర్లకు 27,000 వరకు మరియు మారుతి స్విఫ్ట్ వంటి వాహనాలపై రూ.8,500 వరకు ఆదా అవుతుంది. ఏదేమైనప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని ఆటోమొబైల్ కంపెనీలు స్వాగతించే అవకాశం ఉంది మరియు ఈ నిర్ణయం వలన కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.