Just In
- 1 hr ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- 15 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 16 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 18 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
Don't Miss
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
29 వేల కోట్లతో అనంతపురం అమరావతి మధ్య ఎక్స్ప్రెస్ వే నిర్మించనున్న కేంద్రం
అనంతపురం నుండి అమరావతికి మలుపుల్లేని ఎక్స్ప్రెస్ వే కోసం 29,000 కోట్లు ప్రకటించిన కేంద్రం.
అనంతపురం
నుండి
అమరావతికి
మలుపుల్లేని
ఎక్స్ప్రెస్
వే
కోసం
29,000
కోట్లు
ప్రకటించిన
కేంద్రం.
కేంద్ర
నిధులతో
అనంతపురం
అమరావతి
మధ్య
600
కిలోమీటర్ల
మేర
నాలుగు
మరియు
ఆరు
లేన్ల
రహదారి
నిర్మించనుంది.
విభజనకు ముందు తెలుగు రాష్ట్ర రాజధాని హైదరాబాదుకి అనంతపురం నుండి నాలుగు రోడ్ల రహదారి ఉండేది. ఏడవ నెంబర్ జాతీయ రహదారి అనంతపురం మరియు హైదరాబాద్లను కలిపేది.
విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుండి అధిక దూరంలో ఉన్న జిల్లాలలో అనంతపురం ఒకటి. అయితే అనంతపురం నుండి అమరావతికి జాతీయ రహదారి లేకపోవడంతో రాయలసీమతో రాజధాని అనుసంధానం కాస్త కష్టతరంగా మారింది.
అయితే కేంద్రం ఈ ప్రాజెక్టును దాదాపు ఖరారు చేసింది. ఈ రహదారి మొత్తం నిర్మాణానికి కావాల్సిన నిధులను కేంద్రమే సమకూర్చనుంది.
ఈ రహదారి ప్రతిపాదనలు మరియు దీనికి సంభందించిన నిధులు గురించిన అంశాన్ని కేంద్రం మంత్రివర్గంలో చర్చించాల్సి ఉంటుంది.
2017 భారతదేశపు సరుకు రవాణా సమావేశంలో కేంద్రం రవాణా, జాతీయ రహదారులు మరియు షిప్పింగ్ మంత్రి నితిన్ గడ్కరీ గారు ఈ ప్రాజెక్టును ప్రకటించారు.
రహదారులు మరియు భవనముల ప్రధాన కార్యదర్శి సుమిత గారు ఓ పత్రికకు ఇచ్చిన వివరణలో, ప్రభుత్వం నుండి ఈ ప్రాజెక్టుకు సంభందించి అధికారిక ప్రకటన ఏ సమయంలోనైనా రానుందని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు నెట్వర్క్ విస్తరణలో ఈ అనంతపురం - అమరావతి ఎక్స్ప్రెస్ వే కీలకంగా మారనుంది మరియు నిర్మాణ దశలో ఉన్న రాజధాని నగరాన్ని అనుసంధానం చేస్తూ ఈ ప్రాజెక్టు పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి.
అధికారుల సమాచారం మేరకు, అనంతపురం - అమరావతి మధ్య నిర్మించతలపెట్టనున్న ఎక్స్ప్రెస్ వే కోసం కేంద్రమే నిధులు ఇవ్వనుంది. అయితే ఈ రహదారి వెంబడి ఉండే టోల్ బూత్ల ద్వారా వచ్చే ఆదాయం కేంద్ర ఖజానాకు వెళ్లనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారి కోసం 8,562.84 హెక్టార్ల స్థలాన్ని సేకరించాల్సి ఉంటుంది. అనంతపురం - అమరావతి లను కలిపే ఈ ఎక్స్ప్రెస్ వే అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం మరియు గుంటూరు జిల్లా మీదుగా వెళ్లనుంది.
ఐదు జిల్లాల్లో 45 మండళాలు, 186 గ్రామాలను కలుపుతూ మొత్తం 600 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఇందులో 394 కిలోమీటర్లను నాలుగు లేన్లతో మరియు 208 కిలోమీటర్లను ఆరు లేన్లతో నిర్మించనున్నారు.
ఈ మార్గాన్ని కలుపుతూ కర్నూలు మరియు కడపల నుండి రెండు హై వేలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును 30 నెలల వ్యవధిలో పూర్తి చేసేందుకు ప్రతిపాదిస్తున్నారు. ప్రతిపాదిత మార్గంలో మలుపులను దాదాపు తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఇప్పటి వరకు రాయలసీమ జిల్లాలను అమరావతి కలిపేందుకు ఓ రహదారి అంటూ ఏదీ లేదు. ప్రస్తుతం అనంతపురం నుండి అమరావతి మధ్య రైలు ప్రయాణం 12 నుండి 14 గంటలుగా ఉంది. ఈ రహదారి పూర్తయితే 5 నుండి 6 గంటల్లో రోడ్డు ద్వారా రాజధాని చేరుకోవచ్చు.
గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలుగా ఈ ఎక్స్ప్రెస్ను నిర్మించనున్నారు. ఇందుకు అడ్డంకిగా ఉన్నటువంటి కొండ మరియు వాలు తలాలను కూడా సమాతరం చేయాలని భావిస్తోంది.