Just In
- 4 min ago ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- 1 hr ago ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- 3 hrs ago వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
- 3 hrs ago మితిమీరిన అభిమానం.. ఫ్యాన్స్ అత్యుత్సాహానికి విజయ్ కారు అద్దాలు ధ్వంసం, వీడియో వైరల్
Don't Miss
- News ప్రధాని మోదీ ఎదుటే కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్న టీడీపీ ఎమ్మెల్యే.. తరువాత రియాక్షన్ ఏమిటంటే..?
- Sports IPL 2024 సీజన్లో చెలరేగేది ఆ కుర్రాడే: సునీల్ గవాస్కర్
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- Movies ఎమ్మెల్యేను, ఎంపీని ప్రశ్నించగలరా? రైతుబిడ్డను నిలదీస్తారా? హీరో శివాజీ ఫైర్
ఎమర్జెన్సీ వాహనాలకు మినహాయిస్తే, PM కారైనా... CM కారైనా సైరన్ బుగ్గలు వాడద్దు!
వీఐపీలు వినియోగించే కార్ల మీద ఎర్ర బుగ్గలను తొలగించాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ప్రధాన మంత్రి, రాష్ట్రపతి నుండి అన్ని వీఐపీల వాహనాలపైనున్న బుగ్గ లైట్లను తొలగించాలని కేంద్రం తెలిపింది.
ప్రధాన
మంత్రి,
రాష్ట్రపతి
మరియు
ఉప
రాష్ట్రపతితో,
ప్రధాన
న్యాయమూర్తితో
పాటు
లోక్
సభ
స్పీకర్
సహా
దేశవ్యాప్తంగా
ఉన్న
అందరి
వీఐపీల
కార్ల
మీద
బుగ్గలను
తొలగించేందుకు
కేంద్ర
ప్రభుత్వం
నిర్ణయించింది.
మరి అత్యవసర సేవలకు వినియోగించే వాహనాలు మీదున్న బుగ్గ లైట్లు కూడానా అంటే, ఇందుకు ఆ ఎమర్జెన్సీ వాహనాలను మినహాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. అంబులెన్స్, ఫైర్ వెహికల్, పోలీసు మరియు ఆర్మీ వాహనాలు మీదున్న బుగ్గ లైట్లు అలాగే యథావిధిగా కొనసాగుతాయి.
ఈ కొత్త నియమం మే 1, 2017 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి వర్గం పేర్కొంది.
దీని గురించి కేంద్ర రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, ఎమర్జెన్సీ వాహనాలు మినహాయిస్తే దేశవ్యాప్తంగా ఉన్న వీఐపీల కార్ల మీద బుగ్గ లైట్ల నిషేధించే చారిత్రాత్మక చట్టాన్ని తెచ్చినట్లు పేర్కొన్నాడు.
ఈ కొత్త చట్టం భారత దేశపు ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రి వర్గం, ప్రభుత్వాధికారులు, హై కోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులందరికీ వర్తిస్తుంది.
అధికారులు తమ కార్ల మీద బుగ్గ లైట్లను తొలగించాలని ఉత్తర ప్రదేశ్ మరియు పంజాబ్ ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నారు. దీనిని దేశవ్యాప్తంగా వర్తింపచేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
అధికారులు తమ స్టేటస్కు గుర్తుగా బుగ్గ లైట్లను హాస్యాస్పదంగా వినియోగిస్తున్నారని 2013 లో సుప్రీం కోర్టులు చేసింది. వెంటనే బుగ్గ లైట్లను తొలగించాలను సుప్రీం కోర్టు ఆదేశించింది.
అయితే తరువాత 2015 లో సుప్రీం మళ్లీ ఇవి హోదా చిహ్నాలను పేర్కొంది. అయితే మొత్తానికి రాష్ట్రపతి నుండి సాధారణ వీఐపీ వరకు అందరు కూడా బుగ్గ లైట్లను తొలగించాలను కోర్టు కూడా ఈ సారి ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది.