Just In
- 1 hr ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 2 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 2 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- 4 hrs ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
Don't Miss
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Movies వాడుంటే రాత్రికి పండగే.. అలా పడుకుంటా! పచ్చిగా బిగ్ బాస్ బ్యూటీ ఓపెన్
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
నాగసాకి, హిరోషిమా నగరాల మీద బాంబుల వర్షం కురిపించిన చారిత్రక విమానం గురించి
రెండవ
ప్రపంచ
యుద్దం
దీనిని
తలచుకుంటేనే
మొదటగా
గుర్తొచ్చేది
జపాన్లోని
నాగసాకి
మరియు
హిరోషిమా
మీద
జరిగిన
అణుబాంబు
దాడులు,
దీనికి
కారణం
అమెరికా.
ప్రపంచ
చరిత్రలో
అత్యంత
ఘోరమైన
విపత్తులలో
ఇవి
రెండు
ఎంతో
ముఖ్యమైనవి
మరియు
ప్రపంచానికి
ఉన్న
రెండు
చీకటి
రోజులు
అన్నా
కూడా
ఇవి
రెండూ
జరిగిన
రోజులను
చెప్పవచ్చు.
ఈ
భీకర
దాడుల్లో
సుమారుగా
40
లక్షల
మంది
అభాగ్యులు
ప్రాణాలు
పోగొట్టుకున్నారు.
అణు
బాంబు
దాడుల
ప్రభావం
అంతటితో
ఆగి
పోలేదు,
ఇది
కొన్ని
ఏళ్ల
పాటు
ఆ
ప్రాంతాలలో
తీవ్ర
దుష్ర్పవాలను
చూపింది.
Also
Read:
గనులలో
వినియోగించే
వాహనాల
గురించి
ఆశ్చర్యపరిచే
నిజాలు
రెండవ
ప్రపంచ
యుద్ద
సమయంలో
ఇంగ్లాండ్
ఇలాంటి
దాడులను
చేయాలని
పథకం
పన్నింది.
అయితే
దీనిని
పసిగట్టిన
అమెరికా
ఇంగ్లాండు
కన్నా
ముందుగా
జపాన్లోని
నాగసాకి
మరియు
హిరోషిమా
ప్రాంతాల
మీద
అణు
బాంబు
దాడులను
నిర్వహించింది.
ఇందుకోసం
అమెరికా
బోయింగ్
బి-29
అనే
విమానాన్ని
వినియోగించింది.
ఇలాంటి
ఎన్నో
విశయాలు
క్రింది
కథనంలో
కలవు.
చివరి యుద్దం
1945 లో ఒక ఒప్పంద ప్రకారం అమెరికా, యుకె మరియు జర్మనీ వంటి దేశాలు రెండవ ప్రపంచ యుద్దానికి ముగింపు పలికారు. 1945 మే 8 న యూరప్లో ఈ రెండవ ప్రపంచ యుద్దానికి స్వస్తి పలికారు. అయితే జపాన్ మాత్రం తీరని కక్షతో అలాగే మిగిలిపోయింది.
అమెరికా రహస్య చర్యలు
జపాన్ మీద అత్యంత శక్తివంతమైన దాడులు చేయడానికి ఇంగ్లాండ్ మరియు అమెరికా సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి. అందుకోసం అమెరికా ఈ రహస్యం విమానాన్ని వినియోగించింది. శత్రువు యొక్క శత్రువు మిత్రుడు అయినట్లు అప్పట్లో చైనా కూడా వీటితో చేతులు కలిపింది.
ఏకైక మార్గం
అప్పట్లో జపాన్కు వారి వద్ద ఉన్న ఆయుధాలతో 1945 జూలై 26 న లొంగిపోవాలని జపాన్ శత్రు దేశాలు తెలిపాయి. అయితే జపాన్ దీనికి నిరాకరించింది. దీనితో ఎలాగైనా జపాన్ను ఓడించాలని ఇలా అణుబాంబు అస్త్రాలను వినియోగించింది.
జపాన్ను రెండవ ప్రపంచ యుద్దంలో నియంత్రించడానకి ముఖ్యంగా కొన్ని నగరాలను లక్ష్యంగా పెట్టుకుని దాడులు నిర్వహించాలని పథకం పన్నింది. అందులో భాగంగా జపాన్లో అణుబాంబులను ప్రయోగించడానికి నాగసాకి మరియు హిరోషిమా ప్రాంతాలను ఎంచుకుంది.
అణు పరీక్షలు
1945 జూలైలో అమెరికా మెక్సికోలో గల ఎడారిలో అణు పరీక్షలు నిర్వహించింది. ఈ ప్రాజెక్ట్కు మ్యాన్హట్టా అనే పేరును కూడా పెట్టుకుంది. అప్పట్లో అమెరికా అభివృద్ది చేసిన అణుబాంబులు ఎంతో శక్తివంతంగా మరియు సరికొత్త రూపం, ఫీటర్లను కలిగి ఉండేవి.
బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్
అమెరికా అప్పటికే అణుబాంబులను సిద్దం చేసుకుంది వాటిని ఇక ప్రయోగించడమే అలస్యం. అయితే దీనికోసం ఒక ప్రత్యేక విమానం కావాల్సి వచ్చింది. అమెరికాకు మిత్ర దేశంగా ఉన్న ఇంగ్లాండ్ ప్రత్యేక విమానం కోసం కావాల్సిన సాంకేతికను అమెరికాకు ఇచ్చింది. దాని ద్వారానే బోయింగ్ ప్రత్యేక విమానాన్ని తయారు చేసింది.
విమానం మోడల్
అమెరికా అత్యంత ప్రత్యేకంగా రూపొందించుకున్న బోయింగ్ బి-29 సూపర్ఫోర్ట్రెస్ అనే విమానం విశేష పనితీరును కనబరిచింది. రెండవ ప్రపంచ యుద్దంలో బాంబులను ప్రయోగించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ విమానం గరిష్ట మరియు కనిష్ట వంటి ఎటువంటి ఎత్తుపలలో అయినా ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉండేది.
జర్మనీ మొదటి సారిగా....
అప్పట్లో ఇంగ్లాండ్ భారీ స్థాయిలో ఉండే గగన వాహనాలను తయారు చేసేది, ఇంగ్లాండ్ రూపొందించిన ఈ బోయింగ్ బి- 29 విమానాన్ని ఉపయోగించి టర్కీ మీద జర్మనీ దాడులకు యత్నించింది. ఇందు కోసం ఇంగ్లాండ్ నుండి జర్మనీ ఈ విమానాన్ని 1942 లో కొనుగోలు చేసింది. అందుకోసమే దీని ద్వారా జపాన్ మీద దాడులు జరపాలని నిర్ణయించుకుంది అమెరికా.
ఎంపిక
శత్రు దేశాలు చెప్పినట్లు ఆయుధాలతో పాటు జపాన్ లొంగిపోవడానికి నిరాకరించినందుకు, జపాన్కు చెందిన శత్రు దేశాలు దీని మీద అణు బాంబు దాడులు జరపాలనే విషయాన్ని ఓ కొలిక్కి తీసుకువచ్చాయి. అందు కోసం దాదాపుగా 15 బోయింగ్ బి-29 విమానాలను ఎంపిక చేశారు. ఇవి అప్పట్లో ఉన్న విమానాలతో పోల్చితే అనేక ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉండేవి.
బ్రాండ్
అప్పట్లో విమానం ద్వారా దాడులు నిర్వహించడానిరకి బోయింగ్ విమానాలనే ఎక్కువగా ఎంచుకునే వారు. అందులోను అణు బాంబులను ప్రయోగించే సామర్థ్యం ఉన్న ఈ విమానాలకు ప్రత్యేకంగా వెర్షన్ అనే కోడ్ పేరును ఉపయోగించారు. దీని ముఖ్య లక్ష్యం ముందుగా నిర్ణయించుకున్న ప్రదేశంలో బాంబుదాడులను నిర్వహించడం.
సిల్వర్ ప్లేటు
ప్రాజెక్ట్ ప్లేట్ అనే కోడ్ పేరు ద్వారా చేపట్టిన ప్రాజెక్ట్లో భాగంగా బోయింగ్ బి-29 సిల్వర్ ప్లేట్ అనే విమానాలను అభివృద్ది చేశారు. వర్జీనియాలోని మిలిటరీ ప్రయోగశాల కేంద్రం వేసిన మొదటి అడుగు ఇది. నూతన ఎయిర్ క్రాఫ్ట్ల పనితీరును పరీక్షించడానికి కూడా స్కేల్ మోడల్ టెస్ట్ కూడా నిర్వహించారు.
ప్రోటోటైప్
ఈ విమానాలకు నిర్వహించిన స్కేల్ మోడల్ టెస్ట్ విజయవంతమైంది, ఆ తరువాత బోయింగ్ ప్రోటోటైప్ మోడల్ అయిన బోయింగ్ బి-29 అనే ఎయిర్క్రాఫ్ట్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ఆ తరువాత 1944లో వీటికి కాలిఫోర్నియా మొరాక్ ఆధారిత ఎయిర్ ఫోర్స్ సంస్థ ట్రయల్ ట్రన్ నిర్వహించింది. ఈ పరీక్షల తరువారత కూడా వీటిని కావాల్సిన అదనపు ఫీచర్ల కోసం ఇందులో మార్పులు చేశారు.
ఆర్డర్
సిల్వర్ బ్లేడ్ ప్రాజెక్ట్లో భాగంగా మొత్తం 17 విమానాలను ఆర్డర్ చేసింది అమెరికా. వీటన్నింటిని కూడా వివిధ దశల్లో పరిశీలించి తీసుకున్నారు.
ట్రైనింగ్, పరీక్షలు
అమెరికాలోని ఎయిర్ఫోర్స్ లో ఉన్న 509 మిశ్రమ గ్రూపు ఈ విమానల ద్వారా బాంబులను ప్రయోగించే శైలిని యుద్ద విమానాలను నడిపే పైలట్లకు శిక్షణ ఇచ్చారు.
ట్రాన్సిషన్స్
ముందుగా ఎంపిక చేసుకున్న ప్రదేశాల మీద బాంబులు ప్రయోగించిన తరువాత ఆ ప్రదేశం నుండి అతి త్వరిత గతిన తప్పుకోవడానికి ఇంగ్లాండ్ ప్రత్యేకమైన సూచనలు కూడా ఇచ్చింది. దీనితో పాటు, ఈ విమానాలలోని ఇంజన్లు ప్రత్యేకంగా అభివృద్ది చేశారు. ఇందులో ముఖ్యంగా ఆధునిక ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, కూలింగ్ వ్యవస్థను ఆధునీకరించారు. మరియు గరిష్ట వేగంతో కదలడానికి అవసరమయ్యే ప్రత్యేక ఏర్పాట్లను కూడా ఇందులో చేశారు.
అదనంగా మరిన్ని విమానాలు
కాంపోసిట్ గ్రూప్ అమెరికాకు చెందిన ఎయిర్ ఫోర్స్లో అప్పట్లో ఇది ఒక విభాగంగా ఉండేది, బోయింగ్ విమానాలను పరీక్షించింది కూడా ఇదే. అయితే వీరి కథనం ప్రకారం అమెరికా 509 బ్రిగేడ్ అనే పేరుతో సుమారుగా 28 బోయింగ్ బి-29 విమానాలకు అర్డర్ ఇచ్చింది.
ప్రత్యేకతలు
ఈ బోయింగ్ బి-29 ఎయిర్క్రాఫ్ట్లలో నాలుగు ఇంజన్లను అందించారు. రిమోట్ ద్వారా అగ్నిమాపక పరికరాలను వినియోగించడం మరియు అన్ని చక్రాల ఉన్న చోట్లు రెండేసి చక్రాలను అందించారు.
నిక్షిప్త ప్రదేశం
అమెరికా తమ బోయింగ్ బి-29 విమానాలను మరియు దాడులు చేయడానికి కావాల్సి అణు బాంబులను టైనెన్ అనే ప్రాంతంలో సిద్దంగా ఉంచింది. అమెరికా తెలిపిన రోజున నాటికి జపాన్ లొంగిపోకపోతే ఈ ప్రాంతంలో ఉన్న విమానాల ద్వారా దాడులు చేయించాలని పథకం వేసుకుంది.
మొదటి దాడి
మొదిటి సారిగా అమెరికాకు చెంది బోయింగ్ బి-29 విమానం జపాన్లోని హిరోషిమా నగరం మీద 1945, ఆగష్ట్ 6 న అణు బాంబును జారవిడిచింది. మొదటి సారిగా ప్రయోగించిన అణు బాంబుకు లిటిల్ బాయ్ అనే పేరు కూడా పెట్టారు. ఈ దాడిలో సుమారుగా కొన్ని వందల వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
హెచ్చరిక
హిరోషిమా మీద దాడి చేయడానికి దాదాపుగా 16 గంటల ముందు అప్పటి అమెరికా ప్రధాని హ్యార్రీ ఎస్.ట్రూమన్ జపాన్ను హెచ్చరించాడు. మేము చెప్పినట్లు తలొగ్గకపోతే తీవ్ర పరిమాణామాలను చవి చూస్తారు మరియు గగన తలం నుండి బాంబుల ద్వారా తీవ్రమైన దాడులను అనుభవిస్తారు అని హెచ్చరించాడు.
రెండవ దాడి
హిరోషిమా మీద అణు బాంబు ద్వారా దాడి జరిపిన మూడు రోజులకు అమెరికా వారి బోయింగ్ బి-29 విమానం ద్వారా జపాన్లోని నాగసాకి మీద అణు బాంబు దాడి జరిగింది. ఈ బాంబు పేరు ఫ్యాట్ బాయ్గా అభివర్ణించారు. ఈ ఫ్యాట్ బాయ్ బ్యాక్స్కేర్ అనే పేరుతో కూడా పిలిచారు. ఈ దాడి ద్వారా నాగసాకి నగరం 40 శాతం వరకు నాశనం అయిపోయింది.
నాగసాకి లో పరీక్షలు
మొదటి దాడి జరిపిన తరువాత ఎనోలా క్యూ అనే వ్యక్తి నాగసాకి నగరం మీద దాడులు జరపడానికి పరీక్షల కోసం వచ్చాడు, అయితే ఆ ప్రదేశం అప్పట్లో ఎంతో వేడితో కూడుకుని ఉండేది, దీనిని దృష్టిలో ఉంచుకునే రెండవ దాడిని నాగసాకిలో జరపాలని సూచనలు ఇచ్చాడు.
ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్
రాత్రి పూట గరష్ట ఎత్తును చేరుకోకుండా సరైన ఎత్తు నుండి దాడులను నిర్వహించాలని పథకం వేసుకున్నారు, అందుకోసం బోయింగ్ బి-29 ఎయిర్ క్రాఫ్ట్ సరైనది అని నిర్ణయించుకున్నారు. అయితే అణు బాంబును ప్రయోగించిన తరువాత దాని ఫలితం ఈ విమానాల మీద పడకుండా వీటిని ప్రత్యేకంగా రూపొందించారు.
వేగం
అణు బాంబులను ప్రయోగించిన తరువాత విమానం కేవలం 43 సెకండ్లలోనే భూమిని చేరుకోగలవు. అయితే ప్రయోగించిన తరువాత కొద్ది దూరం పాటు ప్రయాణించి తరువాత సురక్షితంగా నేల మీద దిగే ఏర్పాట్లు ఇందులో చేశారు.
మ్యూజియంలో ఉన్న విమానం
రెండవ ప్రపంచ యుద్ద కాలంలో శత్రు దేశాలకు గుబులు పుట్టించిన ఈ బోయింగ్ బి-29 విమానం అమెరికాలోని ఓహియోలో గల అమెరికా మిలిటరీ మ్యూజియమ్లో దీనిని ఉంచారు. ఫ్యాట్ బాయ్ బాంబును ప్రయోగించిన విమానాన్ని కూడా ఇప్పుడు అక్కడ ప్రదర్శనకు ఉంచారు.
లొంగిపోయిన జపాన్
హిరోషిమా మరియు నాగసాకి నగరాల మీద శక్తివంతమై అణు బాంబుల ద్వారా దాడులు జరిపిన తరువాత జపాన్ తమ వద్ద ఉన్న ఆయుధాలతో సహా 1945 సెప్టెంబర్ 2 న అమెరికా కూటమి ముందు లొంగిపోయింది. అంతటితో రెండవ ప్రపంచ యుద్దం కూడా ముగిసిపోయింది.
కాపీకొట్టిన రష్యా
అమెరికా జపాన్ మీద విజయవంతంగా బోయింగ్ బి-29 విమానాల ద్వారా అణు బాంబు దాడులను నిర్వహించిన తరువాత రష్యా ఏవియేషన్ రంగం బోయింగ్ బి-29 లోని పరిజ్ఞానం ద్వారా టుపెలోవ్ డ్యూ-4 విమానాలను అభివృద్ది చేసుకుంది.
జపాన్ అణు విపత్తు యొక్క విషయాలు-నిర్ఘాంతపోయే సత్యాలు
ఇండియా-పాకిస్తాన్ల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం....?
నార్త్ కొరియాను బయపెడుతున్న అమెరికన్ బోయింగ్ బి-52 బాంబర్
యుద్దానికి సిద్దమైన ఇండియన్ ఆర్మీ, డిఫెన్స్ మరియు నేవీ
ISIS తీవ్రవాదుల అంతానికి బ్రహ్మాస్త్రం ప్రయోగించనున్న రష్యా ప్రధాని పుతిన్
తీర ప్రాంతాల్లో మొహరించిన అమెరికా ఆంపిబియస్ యుద్ద ట్యాంకులు