Just In
- 1 hr ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 3 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 4 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 6 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Movies Hyper Aadi: నిన్ననే సీక్రెట్గా పెళ్లి చేసుకున్న హైపర్ ఆది.. షోలో వైఫ్ ఫేస్ రివీల్.. మీరూ చూశారా?
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
భారత దేశపు అత్యంత పొడవైన వంతెన గురించి ఆసక్తికరమైన విషయాలు!
భారీ వ్యయంతో నిర్మించిన ఈ వంతెన చివరి దశ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైంది. అయితే ఇందులో ప్రత్యేకత ఏముందనుకుంటున్నారా...? దీనిని ప్రారంభిస్తే, దేశవ్యాప్తంగా అత్యంత పొడవైన వంతెనగా నిలవనుంది.
అస్సాం
మరియు
అరుణాచల్
ప్రదేశ్
రాష్ట్రాలను
కలుపుతూ
నిర్మించిన
వంతెన
ఇప్పుడు
చివరి
దశ
పనుల్లో
ఉంది.
9.15కిలోమీటర్ల
పొడవున్న
ఈ
వంతెన
ఇప్పుడు
భారతదేశంలోకెల్లా
ఉన్న
అత్యంత
పొడవైన
వంతెనల
జాబితాలో
ముందు
నిలిచింది.
ఈ
వంతెన
గురించి
మరిన్ని
వివరాలు....
ప్రధాని నరేంద్ర మోడీగారు అతి త్వరలో ఈ వంతెనను ప్రారంభించనున్నార. ఇందుకు గాను అస్సాం ముఖ్యమంత్రి శ్రీ సరబానంద్ సోనొవాల్ గారు నరేంద్ర మోడీగారిని ఆహ్వానించారు.
అరుణాచల్ ప్రదేశ్ ప్రదేశ్ మరియు అస్సాం రాష్ట్రాలను కలుపుతూ లోహిత్ మరియు బ్రహ్మపుత్రా నదుల మీద నిర్మించిన ఈ వంతెన పొడవు సుమారుగా 9.15 కోలోమీటర్లుగా ఉంది.
వంతెన పొడవు పరంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యంత పొడవైన వాటిలో ఇది మొదటి స్థానంలో నిలిచింది. ఈ వంతెనను సుమారుగా 950 కోట్ల రుపాయలు వెచ్చించి నిర్మించారు.
అస్సాంలోని రాజధాని గౌహతికి 540కిమీల దూరంలో ఉన్న సాదియా నుండి ప్రారంభమయ్యి, అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్కు 300కిమీల దూరంలో ఉన్న ధోలా అనే ప్రాంతం వరకు దీనిని నిర్మించారు.
దీనిని పూర్తి స్థాయిలో ప్రారంభించి రాకపోకలకు అనుమతిస్తే, రెండు రాష్ట్రాలలోని రాజధాని ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం సుమారుగా నాలుగు గంటల వరకు తగ్గిపోనుంది.
అరుణాచల్ ప్రదేశ్లో విమానాశ్రయం లేకపోవడంతో ఇప్పటి వరకూ వాయు సేవలు లేవు. అయితే ఈ వంతెన పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, రెండు రాష్ట్రాల మధ్య రవాణా సదుపాయం మరింత సరళం కానుంది.
ఈ వంతెన నిర్మాణాన్ని 2011లో ప్రారంభించారు.దీని నిర్మాణం కోసం సుమారుగా రూ. 950 కోట్ల రుపాయల నిధులు విడుదల చేశారు
యుద్ద ట్యాంకులు మరియు భారీ పరిమాణంలో ఉన్న మిలిటరీ వెహికల్స్ కూడా ప్రయాణించేందుకు వీలుగా దీనిని నిర్మించడం జరిగింది.
భారత దేశంలో భారీ వ్యూహాత్మక విలువలు గల రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం ఉన్నాయి. యుద్ద కాలంలో మిలిటరీ దళలాలు ఎక్కువగా ఈ రాష్ట్రాల్లో సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి వారికోసం మెరుగైన రవాణా ఈ వంతెన ద్వారా సాధ్యం కానుంది.
దేశవ్యాప్తంగా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ప్రధాన రహదారుల అభివృద్దికి రూ. 50,000 కోట్ల రుపాయలను కేటాయించగా, ఇందులోని నుండి సేకరించిన 950 కోట్ల రుపాయల మొత్తంతో ఈ వంతెన నిర్మాణం పూర్తి చేసారు.
ప్రస్తుతం ఉన్న బంద్రా-వొర్లి సముద్రం మార్గం మీదుగా ఉన్న 3.55 కిలోమీటర్ల పొడవున్న వంతెన కన్నా ఈ ధోలా-సాదియా వంతెన పొడవైనది.