Just In
- 35 min ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 14 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 16 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 18 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
Don't Miss
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Movies సుడిగాలి సుధీర్ అమ్మాయిల పిచ్చోడా? జబర్దస్త్ కమెడియన్ ఘాటుగా రియాక్షన్!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మోడీ ఎఫెక్ట్; భారతదేశ రక్షణ ఒప్పందంపై ప్రపంచ దేశాల పోటీ
పాకిస్తాన్ చైనాతో చేతులు కలిపి భారత్పై చేస్తున్న దురాగతాలను ఎండగట్టడానికి మోడీ చేసిన ప్రయత్నాలు రోజు రోజుకీ ఒక్కొక్కొటిగా ఫలిస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రపంచ దేశాలు భారత్కు అండగా నిలుస్తున్నాయి. మరికొన్ని దేశాలు పొటీ పడి మరి సైనిక సహాయాన్ని అందివ్వడానికి ముందుకువస్తున్నాయి.
మోడీ
గారు
ప్రారంభించిన
మేకిన్
ఇండియా
చొరవతో
స్వీడిష్కు
చెందిన
ఏరోస్పేస్
మరియు
డిఫెన్స్
దిగ్గజ
సంస్థ
సాబ్
గ్రూప్
(
Saab
group)
ఇండియాలో
గ్రిపెన్
యుద్ద
విమానాల
(Gripen
Fighter
Aircraft)ను
తయారు
చేయడానికి
సిద్దమైంది.
దీనితో
పాటు
భారతీయ
త్రివిధ
ధళాలకు
సాబ్
గ్రూప్
తన
వంతు
పూర్తి
సహాయ
సహకారాలను
అందివ్వనుంది.
నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన మేకిన్ ఇండియా చొరవతో ఇండియాలో యుద్ద విమానాల తయారీ మరియు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడానికి సాబ్ గ్రూప్ సిద్దమైంది. ఇందుకు సంభందించి ఉత్పత్తి ప్లాంటుని ఇండియాలో నెలకొల్పడానికి సాబ్ గ్రూప్ సుముఖంగా ఉంది.
సాబ్ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభింస్తే కలిగే ప్రయోజనాలు.
- యుద్ద విమానాల తయారీకి సంభందించి ప్రభుత్వ రంగం సంస్థలకు సాంకేతిక చేయూత
- దేశీయంగా ఏరోస్పేస్ విభాగ అభ్యర్థులకు ఉద్యోగఅవకాశాలు
- త్రివధ ధళాలకు సాబ్ గ్రూప్ వారి యుద్ద విమానాల అవసరాలను తీర్చడం
- ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు లాభం చేకూరడం
- అన్నింటికి మంచి ఇండియా మీద మొరుగుతున్న దేశాలకు సాబ్ ఉత్పత్తుల ఎగుమతులను అరికట్టవచ్చు.
- పాకిస్తాన్పై ధీటైన పోరాటినికి భారత వైమానికి ధళం చేతికి రాఫెల్ అస్త్రాలు
- కేవలం రెండే గంటల్లో ప్రపంచంలోని ఏ మూలకైనా చేరుకోగలదు
- జపాన్ తొందర పాటు తనమా ? భారత్ వెనకబాటు తనమా...?
సాబ్ గ్రూప్ భవిష్యత్తులో వచ్చే 100 ఏళ్ల వరకు ఇండియాతో కలిసి నడవనుంది. కేవలం ఉత్పత్తి అమ్మకాలు మరియు ఎగుమతులకే పరిమితం కాకుండా భారత ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ సంస్థలకు సాంకేతిక సరఫరా మరియు వ్యాపార రహస్యాలను పంచుకోనుంది.
సాబ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ గ్రూప్ అభివృద్ది చేసిన యుద్ద విమానాలలో గ్రిపెన్ అధునాతనమైనది. ఇండియా, సాబ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే గ్రిపెన్ ద్వారా మరింత బలమైన దేశంగా మారనుంది.
2011లో భారత ప్రభుత్వం నిర్వ హించిన తేలిక పాటి యుద్ద విమానాల బిడ్డింగ్లో రాఫెల్తో గ్రిపెన్ పోటీపడలేక ఆర్డర్ కోల్పోయింది, అయితే ఇప్పుడు గ్రిపెన్ యుద్ద విమానాన్ని అత్యంత శక్తివంతంగా రూపొందించినట్లు సాబ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ మ్యాట్స్ పాంబర్గ్ తెలిపారు.
ప్రస్తుతం గ్రిపెన్ యుద్ద విమానాలను హంగేరి, థాయిలాండ్, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ మరియు సిజెక్ రిపబ్లిక్ అనే దేశాలు తమ వాయు సైన్యంలోకి ఎంచుకున్నాయి.
ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరిలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారితో స్వీడిష్ ప్రధాన మంత్రి స్టీఫెన్ లాఫెన్ కలిసి మాట్లాడిన సందర్భంలో గ్రిపెన్ యుద్ద విమానాలను ఎంచుకోవడానికి ఇండియా సుముఖంగా ఉందని తెలిపారు.
సాబ్ కూడా అడ్వాన్స్డ్ మల్టీ రోల్ యుద్ద విమానం గ్రిపెన్ ఎన్జిని భారత్కు సరఫరా చేయాడానికి సాబ్ సిద్దంగా ఉన్నట్లు సాబ్ గ్రూప్ ప్రకటించింది.
ప్రస్తుతం సాబ్ లోని జెఏఎస్ 39 అధునాతమైన యుద్ద విమానం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. గ్రిపెన్ జెఏఎస్ 39 పూర్తిగా తేలిక పాటి మరియు అన్ని గగన తలాల్లో అత్యంత చురుకుగా ముందుకు దూసుకుపోతుంది.
అన్ని రకాల ఉపరితలాల మీద సానుకూలమైన వేగాన్ని అందివ్వడానికి ఇందులో చైతన్యపూరిత నియంత్రణ (Canard control) ను అందించారు.
గ్రిపెన్ జెఏఎస్ 39 యుద్ద విమానం 70 నుండి 80 డిగ్రీల కోణంలో ప్రయాణిస్తూ దాడులను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
సాబ్ తెలిపిన వివరాల మేరకు గ్రిపెన్ జెఎఏఎస్ 39 యుద్ద విమానం జీవిత కాలం సుమారుగా 50 సంవత్సరాలుగా ఉంది. అత్యంత విశ్వసనీయంగా పనిచేసేందుకు ఇందులో ఉన్న బలాలు ఆర్ఎమ్12 ఇంజన్, పిఎస్-05/ఏ రాడార్లో ఇందులో ఉన్నాయి. ఈ రెండింటి ద్వారా ఈ విమానం యొక్క నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువే.
గ్రిపెన్ యుద్ద విమానం గగన తలంలో ఉన్నపుడు నేల మీద ఉన్న నియంత్రణ విభాగానికి సమాచారాన్ని మరియు తాజా పరిస్థితుల గురించి వివరించడానికి ఇందులో ఎయిర్ డాటా కంప్యూటర్, రాడార్ ఆల్టీమీటర్, విమానం ఉన్న దూరాన్ని నిరంతరం కొలవడానికి ప్రత్యేకమైన జిపిఎస్ పరిజ్ఞానాన్ని ఇందులో అందించారు.
ఎరిక్సన్ మరియు GEC-Marconi వారు సంయుక్తంగా అభివృద్ది చేసిన పిఎస్-05/ఎ పల్సర్ డాప్లర్ ఎక్స్ బ్యాండ్ మల్టీ మోడ్ రాడార్ సాంకేతికతను సాబ్ గ్రూప్ ఈ గ్రిపెన్ జెఏఎస్ 39 పైటర్ జెట్ విమానంలో అందించారు.
ప్రస్తుతం సాబ్ గ్రూప్ సామ్రాజ్యంలో ఉన్న అన్ని గ్రిపెన్ యుద్ద విమానాలలో వోల్వో ఆర్ఎమ్ 12 టుర్బోఫ్యాన్ ఇంజన్లను అందించింది.
గ్రిపెన్ జెఏఎస్ 39 కోసం అధునాతన జనరల్ ఎలక్ట్రిక్ ఎఫ్414 ఇంజన్ను అభివృద్ది చేస్తున్నారు.
గ్రిపెన్ జెఏఎస్ 39 యుద్ద విమానం గరిష్టంగా మ్యాక్ 1.1 వేగాన్ని అందుకుంటుంది.
సాబ్ ఏరోనాటిక్స్ అండ్ డిఫెన్స్ సంస్థ ఇప్పటి వరకూ సుమారుగా 247 యూనిట్లను నిర్మించింది.
గ్రిపెన్ జెఏఎస్ 39 యుద్ద విమానం ధర సుమారుగా 30 నుండి 60 మిలియన్ అమెరికన్ డాలర్ల మధ్య ఉంటుంది.