Just In
- 5 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 7 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 8 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 10 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హైదరాబాద్: కస్టమర్ల సొమ్ముతో పరారైన బైక్ షోరూమ్ మేనేజర్
హైదరాబాద్: నగరంలో స్పోర్ట్స్ బైక్ బుక్ చేసుకోవటానికి వెళ్తున్నారా..? అయితే పారాహుషార్.. సదరు బైక్ షోరూమ్ వాళ్లు మీ డబ్బుతో ఉడాయించే ఆస్కారం ఉంది. నగర నడిబొడ్డులో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లే.. బంజారా హిల్స్లోని కెబిఆర్ పార్క్కు ఎదురుగా, రోడ్ నెం.2లో ఉన్న 'బంజారా హిల్స్ కెటిఎమ్' షోరూమ్లో కెటిఎమ్ స్పోర్ట్స్ బైక్ల కోసం కస్టమర్లు చెల్లించిన డబ్బుతో జ్యోతిరాజు అనే స్టోర్ మేనేజర్ ఉడాయించాడు.
శేషగిరి అనే ఓ కస్టమర్ మూడు నెలల క్రితం తాను రూ.40,000 అడ్వాన్స్ మొత్తాన్ని కట్టి ఓ స్పోర్ట్స్ బైక్ను బుక్ చేసుకున్నానని, కానీ బైక్ బుక్ చేసుకొని మూడు నెలలు దాటిపోయినప్పటికీ ఇంకా షోరూమ్ వాళ్లు బైక్ను డెలివరీ చేయలేదని, ఇందుకు కారణం ఏంటని విచారిస్తే, సదరు స్టోర్ మేనేజర్ జ్యోతిరాజు కస్టమర్లు కట్టిన డబ్బుతో ఉడాయించాడని తెలిసిందని ఓ టెలివిజన్ ఛానెల్తో చెప్పుకొచ్చాడు.
జ్యోతిరాజు బాధితుల్లో తాను మాత్రమే కాకుండా మరో 20 మంది కస్టమర్లు ఉన్నారని, ఇలా వారి వద్ద నుంచి సుమారు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు అడ్వాన్సులను సేకరించి, పరారైనట్లు తనతో షోరూమ్ యాజమాన్యమే చెప్పిందని శేషగిరి వెల్లడించారు. ఈ విషయమైన కెటిఎమ్ షోరూమ్ జిఎమ్ తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
కాబట్టి, మిత్రులారా.. ఇకపై ఏ షోరూమ్లోనైనా సరే లేదా సేల్స్ పర్సన్ వద్దనైనా సరే మీ వాహనాన్ని బుక్ చేసుకున్న తర్వాత ఖచ్చితమైన రసీదును తీసుకోవటం మర్చిపోకండి.