Just In
- 9 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 12 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 15 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 18 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హైదరాబాద్ మెట్రో రైల్ మోడల్ కోచ్ ఆవిష్కరణ
రాష్ట్ర రాజధాని 'హైదరాబాద్'లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా, హైదరాబాద్కు తొలి మెట్రో రైల్ కోచ్ వచ్చింది. ఈ కోచ్ను నెక్లెస్ రోడ్డులోని పివి జ్ఞానభూమి ఎదురుగా ఉన్న ప్రదేశంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోచ్ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.
కొరియాకు చెందిన హ్యుందాయ్ రోట్టర్డామ్ కంపెనీ ఈ మెట్రో రైల్ కోచ్ తయారు చేసింది. ఇది దక్షిణ కొరియా నుంచి చెన్నైకి, అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం మొత్తం 57 రైళ్లు కావల్సి ఉంది. ఇందుకు గాను 171 కోచ్లు అవసరం అవుతాయి. ఈ తొలి కోచ్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ తదితరులు కూడా పాల్గొన్నారు.
మరిన్ని
ఫొటోలను,
వివరాలను
క్రింది
ఫొటో
ఫీచర్లో
పరిశీలించండి.
కొరియాకు చెందిన హ్యుందాయ్ రోట్టర్డామ్ కంపెనీ ఈ మెట్రో రైల్ కోచ్ తయారు చేసింది. ఇది దక్షిణ కొరియా నుంచి చెన్నైకి, అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చింది.
నెక్లెస్ రోడ్డులోని పివి జ్ఞానభూమి ఎదురుగా ఉన్న ప్రదేశంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోచ్ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.
మెట్రో రైల్ కోచ్ రైడర్ సీటులో కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.
రోడ్డుపై రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీకి చెక్ పెడుతూ, నగర ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించాలనే ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ను మొత్తం ఆరు దశల్లో (6 స్టేజ్స్) పూర్తి చేయనున్నారు. ఇందులో మొదటి దశ మార్చ్ 2015 నాటికి పూర్తి కానుంది.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ దశలు, రూట్లు క్రింది విధంగా ఉన్నాయి.
స్టేజ్ 1 - నాగోల్ నుంచి మెట్టుగూడ : మార్చ్ 21, 2015
స్టేజ్ 2 - మియాపూర్ నుంచి ఎస్.ఆర్. నగర్ : ఆగస్ట్ 15, 2015
స్టేజ్ 3 - మెట్టుగూడ నుంచి బేగంపేట్ : నవంబర్ 14, 2015
స్టేజ్ 4 - బేగంపేట్ నుంచి శిల్పారామం : ఆగస్ట్ 15, 2016
స్టేజ్ 5 - ఎస్.ఆర్. నగర్ నుంచి ఎల్.బి. నగర్ : ఆగస్ట్ 15, 2016
స్టేజ్ 6 - జేబిఎస్ నుంచి ఫలక్నుమా : జనవరి 1, 2017
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ రూట్ మ్యాప్.