Just In
- 42 min ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 1 hr ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- 3 hrs ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- 4 hrs ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
Don't Miss
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Movies ‘సీరియల్స్లో తెలుగు వాళ్లను నీచంగా.. కన్నడ యాక్టర్ల ముందు పని వాళ్లకంటే హీనంగా’
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
గోవాలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకను సందర్శించిన మోడీ
గోవా తీరంలో ఉన్న భారతదేశపు అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను నేడు (14.06.2014) ప్రధాని నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా, ఐఎన్ఎస్ విక్రమాదిత్య నౌకను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ ఉదయం గోవా చేరుకున్న ప్రధానికి నేవీ ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం యుద్ధనౌకపై నేవీ కార్యకలాపాలను ఆయన పర్యవేక్షించారు.
భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ సైనిక సంపత్తిని మోడీ పరిశీలించడం ఇదే మొదటిసారి. అరేబియా సముద్ర జలాల్లో నిలిచిన ఈ యుద్ధనౌకపైకి ప్రధాని నేవీ హెలికాప్టర్లో వచ్చారు. ఆ తర్వాత యుద్ధనౌక, నేవీ యుద్ధ విమానాలు సంయుక్తంగా చేపట్టే విన్యాసాలను మోడీ స్వయంగా తిలకించడంతో పాటుగా ఓ ఎయిర్క్రాఫ్ట్లో కూడా ఆయన గగనతలంలో విహరించారు.
ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకోండి.
మరింత
సమాచారం
తర్వాతి
సెక్షన్లలో..
మరిన్ని
వివరాలను
ఈ
ఫొటో
ఫీచర్లో
పరిశీలించండి..!
తర్వాతి స్లైడ్లలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకోండి.
విక్రమాదిత్య యుద్ధనౌకను రష్యా నుంచి 15 వేల కోట్లతో భారత్ కొనుగోలు చేసింది. దీని మొత్తం బరువు 44,500 టన్నులు.
ఈ విమాన వాహక నౌక కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం 2004లో గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కుదరగా, పదేళ్ల తర్వాత 2013 నవంబర్ 16న అప్పటి రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ నౌకాదళంలోకి దాన్ని చేర్చారు.
విక్రమాదిత్య యుద్ధనౌక భారత నౌకాదళంలోకెల్లా అతిపెద్ద, అతిబరువైన నౌక. దీని పొడవు 284 మీటర్లు, ఎత్తు 60 మీటర్లు, బరువు 44,500 టన్నులు.
విక్రమాదిత్య యుద్ధనౌక ఏకకాలంలో 24 మిగ్-29 రకం యుద్ధ విమానాలు, 10 హెలికాప్టర్లను మోసుకెళ్లగలదు.
విక్రమాదిత్య యుద్ధనౌక రోజుకు 1,300 కిలోమీటర్ల దూరం సముద్రయానం చేయగలదు. దీనిలో ఒకసారి ఇంధనం నింపితే ఇది నిరంతరాయం 45 రోజులపాటు పనిచేస్తుంది.
విక్రమాదిత్య యుద్ధనౌకలో నౌక కార్యకలాపాలను 1,600 మంది సిబ్బంది పర్యవేక్షిస్తారు. ఇందులోని సిబ్బంది ఆహారం కోసం నెలకు 16 టన్నుల బియ్యం, 2 లక్షల లీటర్ల పాలు, లక్షకుపైగా గుడ్లు అవసరమవుతాయని అంచనా.
విక్రమాదిత్య యుద్ధనౌక భారత్ కన్నా ముందు రష్యా నౌకాదళంలో సేవలు అందించింది. రష్యా 1987లో ఈ నౌకను ‘బకు' పేరుతో తన నౌకాదళంలో ప్రవేశపెట్టి ఆపై దీనికి అడ్మిరల్ గోర్ష్కోవ్ అని నామకరణం చేసింది.
1996లో తన నౌకాదళ సేవల నుంచి తొలగించాక దీన్ని ఆధునీకరించి భారత్కు విక్రయించేందుకు ముందుకొచ్చింది. దీని కొనుగోలుకు 2004లో భారత్-రష్యాల మధ్య ఒప్పందం కుదిరింది.
వాస్తవానికి రష్యా 2008లోనే ఈ యుద్ధనౌకను భారత్కు అప్పగించాల్సి ఉన్నా నిర్మాణ వ్యయం పెరిగిందంటూ ఆధునీకరణ పనులను ఆపేయడంతో భారత్ మరింత సొమ్ము వెచ్చించేందుకు అంగీకరిస్తూ మరో ఒప్పందం కుదుర్చుకుంది.
దీనిపై మిగ్ 29కె, సీ హారియర్స్, లాంగ్ రేంజి సముద్ర గస్తీ యాంటీ సబ్మెరైన్ యుద్ద విమానం పి8ఎల్, టియు 142ఎం, ఐఎల్-38 ఎస్డి సముద్ర గస్తీ విమానాలు, కామోవ్, సీకింగ్ హెలికాప్టర్లు లాంటి వివిధ రకాల యుద్ద విమానాలు ఉంటాయి.