Just In
- 49 min ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 1 hr ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
- 2 hrs ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- 3 hrs ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
Don't Miss
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Movies Tillu Square Business: సిద్దు మూవీకి రికార్డు బిజినెస్.. ఆ హీరోలతో సమానంగా.. టిల్లు 2 హిట్ కావాలంటే!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సముద్రం మీద ప్రపంచపు అత్యంత పొడవైన వంతెనను నిర్మించిన చైనా
ప్రపంచపు అత్యంత ఎత్తైన వంతెన చైనాలో ఉంది. ఇప్పుడు ప్రపంచపు అత్యంత పొడవైన సముద్రపు వంతెనను చైనా నిర్మించింది. సుమారుగా 50 కిలోమీటర్లు పొడవున్న ఈ వంతెన గురించి మరిన్ని వివరాలు...
దశల
వారీగా
నిర్మాణాన్ని
పూర్తి
చేసుకున్న
50
కిలోమీటర్ల
పొడవున్న
వంతెనకు
హాంగ్కాంగ్-జుహాయ్-మకావ్
అనే
పేరును
పెట్టింది.
చైనా
త్వరలో
దీనిని
ప్రారంభించనుంది.
పూర్తి
స్థాయిలో
అందుబాటులోకి
వస్తే,
ప్రపంచ
వ్యాప్తంగా
సముద్రం
మీద
నిర్మించిన
వంతెనలలో
కెల్లా
అత్యంత
పొడవైనదిగా
ఇది
నిలవనుంది.
మూడు నగరాల మధ్య కారు ప్రయాణ సమయం నాలుగు గంటల నుండి 45 నిమిషాలకు తగ్గిపోయింది. హాంగ్కాంగ్-జుహాయ్-మకావ్ సముద్ర వంతనెను ఏడాది చివరి నాటికి పూర్తిగా అందుబాటులోకి రానుంది.
హింగ్ కాంగ్ నుండి మకావ్ మరియు జుహాయ్ నగరాలను కలిపే ఈ వంతెనను పర్ల్ రివర్ డెల్టా మీద చైనా నిర్మించింది. సముద్రం తలం మీద ఇంత పెద్ద పొడవైన వంతెనను నిర్మించిన దేశంగా చైనా నిలిచింది.
చైనా ప్రాంతంలో అనుసంధానాన్ని ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా చేసుకుని దీనిని నిర్మించింది. ప్రపంచ నిర్మాణ రంగంలో ఇదొక అద్బుతమని చెప్పాలి.
ఈ వంతెనకు మధ్యలో రెండు కృత్రిమ ద్వీపాలున్నాయి. ఈ రెండింటి మధ్య పెద్ద పెద్ద నౌకలు వంతెనను దాటేందుకు సొరంగమార్గాన్ని కూడా నిర్మించారు. ఇది వంతెన మీద వాహన రాకపోకలకు మరియు సముద్రం మీద నౌకల రాకపోకలకు ఉపయోగపడుతుంది.
ఆంగ్లపు వై-ఆకారంలో ఉన్న ఈ వంతెన నిర్మాణాన్ని 2009లో చైనా ప్రారంభించింది. దీని పూర్తి నిర్మాణం కోసం సుమారుగా 100 బిలియన్ యువాన్ల(15బిలియన్ అమెరికన్ డాలర్లకు సమానం)ను ఖర్చు చేసింది.
ఈ వంతెన నిర్మాణం కోసం అనవసరమైన ఖర్చులు భారీగా చేశారనే విమర్శలు ఉన్నట్లు టెలిగ్రాఫ్ ఓ కథనంలో తెలిపింది. అయితే ఈ వంతెన ప్రారంభమైన తొలి 20 ఏళ్లలో 3.5బిలియన్ బ్రిటిష్ పౌండ్ల ఆదాయం తీసుకొస్తుందని అధికారులు తెలిపారు.
పర్ల్ రివర్ డెల్టా మీదుగా ఈ వంతెన ఉండటం ద్వారా తక్కువ ధరలతో తయారయ్యే ఉత్పత్తులను పశ్చిమ దేశాల వినియోగదారుల కోసం ఎగుమతులు కూడా పెరగనున్నాయి.
ప్రపంచపు అత్యంత ఎత్తైన వంతెన చైనాలో ఉంది. ఇప్పుడు ప్రపంచపు అత్యంత పొడవైన సముద్రపు వంతెనను చైనా నిర్మించింది.