Just In
- 1 hr ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- 15 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 17 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 18 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
Don't Miss
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సైకిళ్లకు లోన్ సౌకర్యం; త్వరలో ఎలక్ట్రిక్ సైకిల్స్ లాంచ్
మీ దగ్గర సైకిల్ కొనడానికి కూడా డబ్బులు లేవా..? అయితే, డోంట్ వర్రీ.. ఇప్పుడు సైకిల్కి కూడా లోన్ లభ్యం కానుంది. కార్లు, ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయడానికి ఫైనాన్షియల్ కంపెనీలు ఎలాగైతే రుణాన్ని ఆఫర్ చేస్తున్నాయో, అలాగే సైకిళ్లను కొనుగోలు చేసేందుకు కూడా రుణాన్ని ఆఫర్ చేయనున్నారు. ప్రపంచ అగ్రగామి సైకిళ్ల ఉత్పత్తి సంస్థ హీరో సైకిల్స్ ఈ దిశగా సన్నాహాలు ప్రారంభించింది.
దేశంలోని అనేక ప్రాంతాల్లో సైకిల్ను కొనుగోలు చేసేంత ఆర్థిక సామర్థ్యం కూడా లేని బలహీన ప్రజలు ఉన్నారని, వారి కోసం వాయిదా చెల్లింపు చెల్లింపు పద్ధతిలో సైకిల్ను విక్రయించేలా ఓ కొత్త విధానానికి శ్రీకారం చుట్టనున్నామని హీరో సైకిల్స్ పేర్కొంది. హీరో సైకిల్స్ ఇప్పటికే ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర, గుజరాత్లో ప్రయోగాత్మక ప్రారంభించింది. ఇది సక్సెస్ అయితే, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి రానుంది.
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నివసించే బలహీన వర్గాలకు సైకిల్ కొనుగోలు కోసం రుణాలు ఇచ్చేందుకు గాను హీరో సైకిల్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ (ఎన్బిఎఫ్సి) అయిన ఫుల్లెట్రన్ ఇండియాతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ రుణానికి అర్హులైన వారిని ఎంపిక చేసి రుణాన్ని మంజూరు చేస్తుంది. తక్కువ వడ్డీ రేటుకే 100 శాతాన్ని రుణాన్ని ఇచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో
కూడా..
హీరో
సైకిల్స్
ఈ
సైకిల్
ఫైనాన్స్
స్కీమ్ను
దేశవ్యాప్తంగా
విస్తరించాలని
యోచిస్తోంది.
ఇందులో
భాగంగా
వచ్చే
నెలలో
ఆంధ్రప్రదేశ్తో
సహా
కర్ణాటక,
రాజస్తాన్,
తమిళనాడు,
మధ్యప్రదేశ్
రాష్ట్రాల్లో
కూడా
దీనిని
అందుబాటులోకి
తీసుకురానుంది.
హీరో
ఏ2బి
ఎలక్ట్రిక్
సైకిల్స్..
ఇదిలా
ఉండగా,
హీరో
గ్రూపుకు
చెందిన
ఎలక్ట్రిక్,
ప్రీమియం
సైకిళ్ల
తయారీ
కంపెనీ
హీరో
ఎకో
భారత్లో
తమ
ఎలక్ట్రిక్
సైకిళ్లను
ప్రవేశపెట్టేందుకు
సన్నాహాలు
చేస్తుంది.
ఏ2బి
బ్రాండ్
క్రింద
విదేశాల్లో
అందుబాటులో
ఉన్న
ఎలక్ట్రిక్
సైకిళ్లు
త్వరలోనే
భారత్లో
కూడా
లభ్యం
కానున్నాయి.
హీరో
ఏ2బి
ఎలక్ట్రిక్
సైకిళ్లను
జర్మనీలో
డిజైన్
చేస్తున్నారు.
తేలికపాటి
ధృఢమైన
అల్యూమినియం
ఫ్రేమ్తో
తయారైన
ఈ
ఎలక్ట్రిక్
సైకిళ్లను
సాధారణ
సైకిళ్ల
మారిదిగా
పెడలింగ్
చేస్తూ
తొక్కుకోవచ్చు
లేదంటే
బ్యాటరీ
సాయంతో
నడుపుకోవచ్చు.
అధక రేంజ్ కోసం వీటిల్లో లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ ఛార్జింగ్కు పట్టే సమయం 3 గంటలు, పూర్తి చార్జ్పై ఇది 100 కి.మీ. వరకు పరుగులు తీస్తుంది. ఇందులో టాప్ ఎండ్ మోడల్ గంటకు 60 కి.మీ. వేగంతో పరుగలు తీస్తుంది. ఈ సైకిళ్ల బరువు 25-35 కిలోల రేంజ్లో ఉంటాయి. అయితే, వీటి ధర కూడా అధికంగానే ఉండనుంది (సుమారు లక్షకు పైగా ఉండొచ్చని అంచనా).