Just In
- 1 hr ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 1 hr ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 3 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 4 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News అమిత్ షా ఓ గూండా, రౌడీ, అయినా పక్కనే పెట్టుకున్న ప్రధాని మోదీ, సీఎం కొడుకు సంచలనం!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హోండాకు భారత్లో కోటిన్నరకు పైగా కస్టమర్లు
జపాన్కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండాకు చెందిన పూర్తి భారతీయ అనుబంధ కంపెనీ హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్ఎమ్ఎస్ఐ), భారత మార్కెట్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. హెచ్ఎమ్ఎస్ఐ భారత మార్కెట్లోకి ప్రవేశించి దాదాపు 13 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, దేశీయ విపణిలో కంపెనీ ద్విచక్ర వాహనాల విక్రయాలు 1.5 కోట్ల మైలురాయిని చేరాయి.
భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించిన 13 ఏళ్లకు ఈ ఘనత సాధించామని హెచ్ఎమ్ఎస్ఐ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) వై.ఎస్. గులేరియా తెలిపారు. ఇంత స్వల్పకాలంలోనే ఈ ఘనత సాధించడం హోండా బ్రాండ్పై పెరుగుతున్న వినియోగదారుల నమ్మకానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. జులై 2012 నాటికి కోటి వాహనాల విక్రయ మార్కును దాటామని, తాజా అరకోటి వాహన అమ్మకాలు కేవలం 18 నెలల్లోనే సాధించామని గులేరియా చెప్పారు.
మాస్ (బడ్జెట్) మోటార్సైకిల్ సెగ్మెంట్లో హోండా అందిస్తున్న డ్రీమ్ యుగ, డ్రీమ్ నియో బైక్లకు మంచి ఆదరణ లభించిందని, ఈ బైక్లతోనే మంచి వృద్ధి సాధించామని ఆయన వెల్లడించారు. తమ సేల్స్ నెట్వర్క్ను మరింత విస్తృతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, తర్వలో కొత్తగా మరో 500 టచ్-పాయింట్లను ఏర్పాటు చేస్తామని, వీటితో తమ నెట్వర్క్ 2,500కు పెరుగుతుందని గులేరియా వివరించారు.
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా డిసెంబర్ 14, 1999లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది, ఆ తర్వాత 2001లో తొలిసారిగా తమ మానేసర్ ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తుతం హెచ్ఎమ్ఎస్ఐకి భారత్లో మొత్తం 3 ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. అందులో ఒకటి మానేసర్ (హర్యానా), మరొకటి తపుకరా (రాజస్థాన్)లో ఉండగా మూడవ ప్లాంట్ను ఇటీవలో కర్ణాటకలోని నర్సాపూర్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ మూడు ప్లాంట్ల సాయంతో 2014 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కంపెనీ మొత్తం ఉత్పత్తి సాలీనా 46 లక్షల యూనిట్లకు చేరుకోనుంది.