Just In
- 8 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 10 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 11 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 13 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హెల్మెట్ లేని వారికి అక్కడి పోలీసుల కొత్త రూల్
హెల్మెట్ లేకుండా మోటార్ సైకిళ్లను నడిపే వాళ్ల మీద ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... రైడర్ల తీరు అస్సలు మారడం లేదు. ఇలాంటి వారిలో మార్పు తెచ్చేందుకు మైసూరు ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్ తీసుకొచ్చారు.
మోటార్
సైకిల్
రైడర్
మరియు
తోటి
ప్రయాణికుడు
ఇద్దరూ
తప్పనిసరిగా
శిరస్త్రాణం
ధరించాలనే
నియమం
దేశ
వ్యాప్తంగా
అమల్లో
ఉంది.
నిజానికి
వ్యక్తిగత
ఆసక్తితో
అందరూ
హెల్మెట్
ధరించాలి.
కాని
ఇందుకు
చాలా
మంది
భిన్నంగా
వ్యహరించి
చిన్న
చిన్న
ప్రమాదాలకే
ప్రాణాలు
కోల్పోతున్నారు.
ఎలాగైనా
మోటార్
సైకిళ్ల
రైడర్లు
మరియు
వాటి
తోటి
ప్రయాణికులు
ఖచ్చితంగా
హెల్మెట్
ధరించే
విధంగా
మార్పు
తెచ్చేందుకు
మైసూరు
ట్రాఫిక్
పోలీసులు
ఓ
కొత్త
నియమాన్ని
అమలు
చేస్తున్నారు...
అదేంటో
చూద్దాం
రండి...
మైసూర్ ట్రాఫిక్ పోలీసులలో పరిధిలో ఓ కొత్త రూల్ అమల్లో ఉంది. అది ఏమిటంటే... బైకు మీద వెళ్తున్నపుడు రైడర్ మరియు కో రైడర్ ఇద్దరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అలా ధరించకుండా పోలీసుల కంట పడితే మోటార్ సైకిల్ ను సీజ్ చేస్తారు.
మునుపయితే శిరస్త్రాణం ధరించనందుకు గాను జరిమానా విధించే వారు. అయితే చాలా మంది చేసేది లేక జరిమానా చెల్లించి అక్కడ నుండి జారుకునే వారు. జరిమానా చెల్లించడానికి వెనుకాడేవారు కాదు గానీ. హెల్మెట్ ధరించడానికి మాత్రం అయిష్టం చూపేవారు.
ద్విచక్ర వాహన దారుల ఆటకట్టించే విధంగా, ఏకంగా వారి మోటార్ సైకిళ్లను సీజ్ చేయడానికి సిద్దమైపోయారు పోలీసులు. ఆ తరువాత తమ వద్ద రెండు హెల్మెట్లు ఉన్నాయని చూపిస్తూ వారి బైకును విడిపించుకుపోవచ్చు.
మైసూరు ట్రాఫిక్ పోలీసుల తెలిపిన నివేదికల ప్రకారం, రోజుకు సుమారుగా 300 ద్విచక్ర వాహనదారులు మరియు వారి తోటి ప్రయాణికులు హెల్మెట్ రూల్ను ఉల్లంఘించినందుకు జరిమానా చెల్లిస్తున్నారు. ఈ ధోరణిలో మార్పు తెచ్చేందుకే ఈ ప్రయత్నమని పోలీస్ కమీషనర్ ఏఎస్ రావు తెలిపాడు.
ట్రాఫిక్ ఏసిపి కెఎన్ మాదయ్య మాట్లాడుతూ, హెల్మెట్ నియమాన్ని ఉల్లంఘించే వారి బైకులను శాశ్వతంగా కాకుండా తాత్కాలికంగా నిర్బంధిస్తున్నట్లు వివరించాడు.
సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారం, ప్రతి వాహనం ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇన్సూరెన్స్ లేని వాహనాలను తాత్కాలికంగా సీజ్ చేస్తున్నట్లు కూడా పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు.
హెల్మెట్ మాత్రమే కాకుండా భద్రతకు సంభందించి రైడింగ్లో మొబైల్ ఫోన్ వినియోగించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ దాటడం మరియు గూడ్స్ వాహనాలలో ప్రజలను తరలించడం వంటి వాటిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ పోలీసులు ఆపినపుడు ఏం చేయాలి, ఎలా వ్యవహరించాలి ?
లైసెన్స్, RC బుక్ చేతిలో లేకుండా వాహనాలు నడపవచ్చు
చాలా మందికి తెలియని ట్రాఫిక్ రూల్స్ మరియు వాటి ఫైన్ల వివరాలు