Just In
- 10 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 11 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 14 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 16 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బిఎస్-III ఇంజన్ టూ వీలర్ల స్టాక్ క్లియర్ చేసేందుకు ఎలాంటి ఆఫర్లను ప్రకటించాయో తెలుసా ?
బిఎస్-III ఇంజన్ గల ద్విచక్ర వాహనాల విక్రయాలకు చివరి రోజు నేడే. అయితే ఎలాగైనా స్టాక్ను పూర్తి చేసేందుకు దేశీయ టూ వీలర్ల తయారీ సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటించాయి.
సుప్రీం
కోర్టు
తీర్పు
మేరకు
బిఎస్-III
ఇంజన్
గల
ద్విచక్ర
వాహనాల
విక్రయాలకు
చివరి
తేదీ
నేడే.
రేపటి
నుండి
బిఎస్-III
స్థానంలో
బిఎస్-IV
ఇంజన్
గల
టూ
వీలర్ల
విక్రయాలు
మాత్రమే
జరగనున్నాయి.
అయితే
నేడే
చివరి
రోజు
కావడంతో
టూ
వీలర్ల
తయారీ
సంస్థలు
తమ
బిఎస్-III
స్టాకును
క్లియర్
చేసేందుకు
భారీ
ఆఫర్లు
ప్రకటించాయి.
హీరో మోటోకార్ప్, హోండా టూ వీలర్స్, బజాజ్ ఆటో మరియు టీవీఎస్ వంటి దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థలు భారీ స్థాయిలో ఆఫర్లను ప్రకటించాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒక్క రోజులో వీలైనన్ని టూ వీలర్ల విక్రయాలను టార్గెట్ చేసుకున్నాయి.
గణాంకాల ప్రకారం మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న టూ వీలర్ల తయారీ సంస్థల వద్ద విక్రయించబడని బిఎస్-III బైకుల సంఖ్య 6,70,000 యూనిట్లుగా ఉన్నాయి. స్టాక్ క్లియర్ చేసుకునేందుకు గరిష్టంగా 22,000 రుపాయల వరకు తగ్గింపు ప్రకటించాయి.
జపాన్కు చెందిన టూ వీలర్ల తయారీ దిగ్గజం హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా విభాగం కేవలం మార్చి 31 కోసం మాత్రమే భారీ తగ్గింపును ప్రకటించినట్లు తమ అధికారిక వెబ్సైట్ మరియు ఫేస్బుక్ ద్వారా పేర్కొంది.
మార్చి 31 న జరిగే అన్ని బిఎస్-III ఇంజన్లు ఉన్న బైకులు మరియు ఆటోమేటిక్ స్కూటర్ల మీద గరిష్టంగా రూ. 22,000 ల వరకు తగ్గింపు ప్రకటించింది. ఈ వార్తతో దేశవ్యాప్తంగా ఉన్న హోండా విక్రయ కేంద్రాల్లో కస్టమర్లతో కిటకిటలడాయి.
భారత దేశపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ బిఎస్-III ఉత్పత్తుల మీద గరిష్టంగా రూ. 12,500 ల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది. దీనికి అదనంగా ఉచిత ఇన్సూరెన్స్ ఆఫర్ కూడా అందివ్వడం జరిగింది.
బజాజ్ ఆటో తమ లైనప్లోని అన్ని బైకుల మీద ఉచిత ఇన్సూరెన్స్ ప్రకటించింది. అంతే కాకుండా, సిటి100 మీద రూ. 3000 లు, అవెంజర్, పల్సర్ మరియు ఆర్ఎస్200 మీద వరుసగా రూ. 2,000లు, రూ.7,000 లు మరియు 12,000 రుపాయల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది.
ఇక అమ్ముడుపోకుండా మిగిలిపోయిన బిఎస్-III టూ వీలర్ల గురించి డీలర్లు ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదని కొన్ని తయారీ సంస్థలు తమ డీలర్లకు భరోసానిచ్చాయి.
నేడు (మార్చి 31, 2017) దేశవ్యాప్తంగా జరిగిన విక్రయాల్లో సాధారణ కమ్యూటర్ బైకు ధరలు రూ. 40,000 నుండి రూ. 50,000 ల మధ్య అందుబాటులో ఉన్నాయి. మరి ఈ స్థాయిలో ధరలను తగ్గించి తమ బైకులను విక్రయించుకోవడానికి కారణం ఏమిటని ఆలోచిస్తున్నారా...? దీనికి సమాధానం చూద్దాం రండి..
సాధారణంగా టూ వీలర్లలో అందించే ఇంజన్లు భారత్ స్టేజ్-III ఉద్గార నియమాలను పాటించాల్సి ఉంటుంది. అయితే సుప్రీం కోర్టు గతంలో పేర్కొన్న కథనం మేరకు ఏప్రిల్ 1, 2017 నుండి అన్ని టూ వీలర్లు కూడా బిఎస్-IV ఇంజన్లతో అప్గ్రేడ్స్ నిర్వహించి విక్రయించాల్సి ఉంది. గడువు ముగియడంతో గతంలో అధిక మొత్తంలో ఉత్పత్తి చేసిన టూ వీలర్ల స్టాక్ అధికంగా ఉండటంతో వాటిని క్లియర్ చేసుకునేందుకు కనీవిని ఎరుగని రీతిలో డిస్కౌంట్లను ప్రకటించి మరీ విక్రయాలు చేపట్టాయి.