Just In
- 8 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 9 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 10 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 11 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
క్రూయిజ్ ఇండియా టూర్ బైక్ షో షురూ..!
బైకింగ్ గ్రూప్స్కు ఓ గుడ్ న్యూస్. 'క్రూయిజ్ ఇండియా టూర్ బైక్ షో' తమ మొట్టమొదటి ఎడిషన్ను ముంబైలో ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాన్ని బ్రాండ్ కన్సల్టింగ్ సంస్థ అజూర్ మార్కామ్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 17, 2014వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 23, 2014వ తేదీ వరకు జరుగుతుంది.
ముంబైలోని లోవర్ పరేల్ వద్ద ఉన్న హై స్ట్రీట్ ఫోనిక్స్ మాల్ వద్ద ఈ కార్యక్రమం జరుగుతుంది. బైకింగ్ గ్రూప్స్ అన్ని ఒకే ప్రాంతం వద్ద సమావేశమయ్యేందుకు మరియు తమ నెట్వర్క్ పరిచయాలను మరింత పెంపొందించుకునేందుకు ఏడు రోజుల పాటు జరిగే ఈ క్రూయిజ్ ఇండియా టూర్ బైక్ షో చక్కని వేదికగా నిలుస్తుంది.
ఈ క్రూయిజ్ ఇండియా టూర్ బైక్ షో కార్యక్రమంలో వింటేజ్ బైక్ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. ఇంకా ఇందులో సూపర్బైక్స్, లగ్జరీ క్రూజర్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే, కస్టమ్ బైక్స్కు సంబంధించి ఓ ప్రత్యేక విభాగం కూడా ఉంటుంది. అంతేకాకుండా.. రాక్ షోస్, టాటూ వర్క్షాప్స్, స్టంట్ షో, ఎమ్ఎమ్ఏ ఫైట్స్ వంటి పలు కార్యక్రమాలు కూడా ఉంటాయి.
బైకర్ల ద్వారా తీసిన ఫొటోగ్రాఫ్లతో ఓ ప్రదర్శన కూడా నిర్వహించడం జరుగుతుంది. లీడింగ్ ఉమెన్స్ బైక్ రైడ్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో రేడియో సిటీ ఆర్జే అర్చన కూడా పాల్గొంటుంది. మహిళా సాధికారతను ప్రచారం చేసేందుకు ఈ రైడ్ను నిర్వహిస్తారు. వేలాది మంది బైకర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు ఆశిస్తున్నారు.
తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ క్రూయిజ్ ఇండియా టూర్ బైక్ షోకు సుమారు 6 లక్షల మంది వీక్షకలు రావచ్చని అంచనా. కాగా.. ఇందులో క్రూయిజ్ ఇండియా టూర్ ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభమవుతుంది. ఇందులో మోటార్సైక్లిస్టులు తమ ద్విచక్ర వాహనాలపై దేశవ్యాప్తంగా 8,000 కిలోమీటర్ల దూరాన్ని చుట్టిరానున్నారు.