Just In
- 40 min ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 2 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 6 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 8 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
Don't Miss
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహీంద్రా టూవీలర్స్ నుంచి 150సీసీ స్కూటర్
మహీంద్రా గ్రూపుకి చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూ వీలర్స్, ప్రతి ఆరు నెలలకు ఓ కొత్త మోడల్ను మార్కెట్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే, కంపెనీ ఈ ఏడాది తమ సరికొత్త 300సీసీ మోజో మోటార్సైకిల్తో పాటుగా ఓ కొత్త 150సీసీ స్కూటర్ను కూడా మార్కెట్లో విడుదల చేయాలని భావిస్తోంది.
ప్రతి ఆరు నెలలకు కనీసం ఓ కొత్త మోడల్ను విడుదల చేస్తామని తాము గతంలోనే సూచించామని, తాము ఇందుకు కట్టుబడి ఉంటామని మహీంద్రా టూవీలర్స్ కస్టమర్కేర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మేంద్ర మిశ్రా తెలిపారు. పూనేలోని తమ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బృందం అనేక సెగ్మెంట్లను పరిగణలోకి తీసుకుంటుందని, ఇందులో ఓ 150సీసీ స్కూటర్ కూడా ఉందని ఆయన చెప్పారు.
హైదరాబాద్ మార్కెట్లో మహీంద్రా కొత్త 110సీసీ స్కూటర్ గస్టోని విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మార్కెట్లో మహీంద్రా గస్టో స్కూటర్ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. రాష్ట్ర విపణిలో గస్టో హెచ్ఎక్స్ ధర రూ.48,100 లుగా ఉంటే, గస్టో విఎక్స్ ధర రూ.50,100 లుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్).
ఇదిలా ఉండగా.. మహీంద్రా టూవీలర్స్ ఫ్రాన్స్కి చెందిన ప్యూజో కంపెనీలోని దిచక్ర వాహన యూనిట్లో వాటాల కొనుగోలు ప్రక్రియను ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని కంపెనీ భావిస్తోంది. మహీంద్రా టూవీలర్స్ మొత్తం 54 బిలియన్ యూరోలు చెల్లించి, ప్యూజో మోటార్సైకిల్స్లో 51 శాతం వాటాలను కొనుగోలు చేయనుంది. వీరిద్దరి భాగస్వామ్యంతో భవిష్యత్తులో మరిన్ని మోడళ్లు మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.